అంశం: నీతి
ప్రక్రియ : ఇష్టపది
కవితాసంఖ్య: 04
తేది: 17-10-2024, బుధవారం.
శీర్షిక: నీతి నియమాలు ఎక్కడ?
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .(43)
నేటి న్యాయ వ్యవస్థ నెంచ కుటిల మాయెను
మేటి ఘోర ఖలులతో నేడు చేయి కలిపెను !!
తోటి మనిషి బాధను తోసి తీర్పు నిచ్చెను
కాటి, జైలు వాసము కలుగజేసి చంపెను !!
ధర్మ న్యాయ నిరతిని దాటి ధైత్యు డాయెను
కర్మ భోగ మనుచును కరకు గాను మారెను.
నిర్మల మౌ బతుకుల నిలువు కోత కోసెను .
మర్మ మెరుగని వారి , మట్టి లోన కలిపెను !!
నేటి దేశ పాలన కోట్ల జనుల రోదన.
తోటి వారి హింసకు తోవ గనుటే యోచన
పాలకుల కుశాసన పలుక చిత్ర వేదన.
వేల యువత బాధలు వెరపు నిండు శోషణ.!!
తీర్చువాడే లేడు తిరుగుబాటుల గోడు.
కూర్చు శిక్షలు వేలు , కుటిల బుద్ధులు చూడు.
నేర్పు చూపిన వాడు నేల బతుకడు వాడు
మార్చు ఓట్లను వారు మనిషికి రూక తోడు.
లేపి దొమ్ములు నడుమ ,దొంగ ఓటుల గెలుపు
దోపిడీలే బ్రతుకు, దోచుకొనుటే బలుపు
పాపి యగుచూ కులుకు పాలకులదే గెలుపు.
జూపి మత్తుల సరుకు జూద మాడిన కలుపు !!
రూకలాడిన యాట రూపు మారిన మాట
శోకమొందిన చోట ,లోక నాయకు వేట
చౌకబారుల తీరు చావు బతుకుల పోరు
చాకలాడే మిన్న చదువు లోడిన జోరు.
---------------------------------
No comments:
Post a Comment