Saturday, June 17, 2023

శీర్షిక : గుడి లేని దేవుడు. కవిత

17/06/2023.

మనుమసిద్ధి  కవన వేదిక ,
శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా..
వచన కవితల పోటీ కొరకు ,
అంశం :  నాన్న చిటికెన వేలు.
శీర్షిక : గుడి లేని దేవుడు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .


అమ్మ మనకు జన్మనిస్తే -
ఆ జన్మకు, జీవితాన్నిచ్ఛేది నాన్న!
అమ్మ ప్రేమ, ఆకాశమైతే -
నాన్న ప్రేమ , అనంతం.!
అమ్మ ఒడి ఒక ప్రపంచం అయితే ,
 ఆ ప్రపంచాన్ని నాకు పరిచయం చేసింది నాన్న!
అమ్మ  ఒడి ఒక  బడైతే -
ఆ బడి వైపుకు వేసే -
అడుగుల ఆసరా నాన్న!
అమ్మ అన్న పదం నా తొలి పలుకైతే-
ఆ పదానికి అక్షర శ్రీకారం నాన్న.!
తడబడే అడుగులకు మార్గదర్శకం నాన్న.
కష్టంలో నేనున్నానన్న భరోసా నాన్న .!
జీవిత అవసరాల  అంగడి నాన్న. 
అడుగడుగు విజయాలకు ఆసరా నాన్న !
 నేను గెలిస్తే గర్వపడేది నాన్న .
 ఓడిపోతే  వెన్ను తట్టి ఓదార్చేదీ  నాన్నే !
 అమ్మ మనసు వెన్న అయితే 
ఆ వెన్న కాచితే వచ్చే నేతి సుగంధం నాన్న!
అమ్మ మనకు చందమామను చూపిస్తే
మా చందమామ పంచే వెన్నెల వెలుగు నాన్న !
ఆనందమే జీవితమైతే 
ఆ ఆనందానుభూతిని పంచే నిత్య శ్రామికుడు నాన్న !



ఈ కవిత నా స్వీయ రచన

శీర్షిక. : నా ఉనికి చిరునామా! కవిత

17/06/2023.
తపస్వి మనోహరం పత్రిక కొరకు
అంశం : నాన్న.
విభాగం :  కవిత.
శీర్షిక. : నా ఉనికి చిరునామా!

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .


నవమాసాలూ మోసేది  అమ్మే అయినా
నన్ను ఎప్పుడు చూస్తానా అన్న 
ఆత్రుతతో నిరీక్షిస్తున్న నాన్న !
అప్పుడే పుట్టిన నా బుగ్గలను-
 ఆప్యాయంగా తడుముతూ-
 ఆనందాశృవులతో,గంభీరంగా నాన్న! 
 నాకు తెలియని ప్రపంచాన్ని
 నాకై పరిచయం చేస్తూ,  నాన్న !
 నా ఇష్టాలను తన ఇష్టాలుగా మార్చుకుని-
 పగలు రాత్రుల కష్టానికి-
  కావిడి బరువు మోస్తున్న నాన్న!
ఒడిదుడుకుల జీవిత  సాగరంలో,
ఓలలాడుతున్న సంసార  నావను-
 ఒద్దికగా తీరం చేర్చే ,చుక్కాని నాన్న !
 నా దివ్యమైన భవిత  కోసం ,
బాధ్యతల "బరువు " మోస్తున్న నాన్న !
గెలుపులో నా మొదటి ఆనందం నాన్న .
 ఓటమిలో నా కన్నీటి ఓదార్పు నాన్న !
 నా తప్పటడుగుల తలపు జోరుకు, 
 మార్గదర్శక దండన నాన్న !
  అవివేకం నిండిన అజ్ఞానానికి, 
 విజ్ఞాన గీతను  బోధించే 
 విష్ణు స్వరూపం నాన్న !
నా అంతరంగ ఆలోచనలకు
ఆదర్శం నిండిన ఆచరణ నాన్న.!
నా ఉన్నత జీవిత సాఫల్యానికి
అక్షర  శ్రీకార సారం నాన్న !
నా ఉనికి గుర్తింపు జయానికి
చెరగని చిరునామా నాన్న !!


ఈ కవిత నా స్వీయ రచన.

Tuesday, June 13, 2023

అన్నీ నేనే..అంతా నేనే..కవిత

[13/06, 7:54 pm] JAGADISWARI SREERAMAMURTH: శీర్షిక : అన్నీ నేనే ...అంతా నేనే..

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .


నేను..
నాదమైనా ,  నినాదమైనా 
వేదమైనా , వివాదమైనా
నిజాల దోపిడీకి నీ నీడగా, సాక్షిని
ఆత్మ ఘోషల అక్షర కుక్షిని॥

ఉరుము లేని మెరుపులేదు
భుామి లేని ఆకాశం లేదు.
చినుకు తడిలేని మేఘం లేదు.
భావోద్వేగం లేనిదే కవి కాడు.॥

మట్టి కణాలతో మలచిన దేహం
తాత్కాలికపు ఉనికికి తార్కాణం.
తమస్సు నిండిన మనస్సులో మలినం
వెలిగించు జ్ఞాన సముపార్జనతో దీపం ॥

నేను..
అరుణోదయ శాంతి కిరణాన్ని
ప్రాణ స్పందనల ప్రకృతి వరాన్ని .
అక్షరకోట్ల అనంత భావాకృతికి-. 
వెలుగై వ్యాపించే చింతామణి ద్వీపాన్ని॥

భయాన్ని నేనే , బాధనుా నేనే
గిరి గీసుకున్న గాధనుా,  నేనే...
గుండె గుడిలో వెలిగే జ్యోతిని నేనే
 ఓ న మః లు నింపుకున్న బడిని నేనే॥

విప్లవాల బాటలో  వీర గతిని నేనే
విశ్వ శాంతి బాటలో విజయ కేతనం నేనే ॥
నన్ను నన్నుగా  మలచుకునేవారికి 
శాంతి జీవితాన్ని నేనే...
వ్యక్తిత్వం లేని వారి జీవితాలకు
 వెలుగునివ్వని శాపాన్ని  నేనే.॥
 
 నేను , పాత కొత్తలతో ప్రవహించే 
అనంతాక్షర అమృత వాహినిని..
ఆర్చుకుపోతున్న గుండె మడులలో తడినై 
విప్లవ విత్తులు నాటించే  కలం హలాన్ని ॥

*************************
[13/06, 7:57 pm] +91 93224 00551:
 సూపర్ కవిత మేడం 👌👌👌💐💐💐
[13/06, 8:01 pm] +91 93235 64359: 
భలే 👏👏👏 
ఎంత బలాన్ని పుంజుకుని వ్రాసారో 👍👍🙏
[13/06, 8:06 pm] +91 96193 06414: 
గుండె మడులలో తడినై
విప్లవ కత్తులు నాటించే
కలం హలాన్ని.. సూపర్ 👌👍🙏
[13/06, 8:11 pm] +91 98190 96949: 
మీ కలం హలానికి హ్యాట్స్ ఆఫ్ మేడం 👏
[13/06, 8:22 pm] +91 97698 55645:
 👏👏👏👌👌👌 కలం హలం మీ బలం
🙏🙏🙏

Tuesday, June 6, 2023

ఎందరో మహానుభావులు

*క్షంతవ్యం* ....  అసందర్భం అయినప్పటికీ సమూహ సభ్యులతో పంచుకోవాల్సిన విషయం అనిపించి ఇది పోస్ట్ చేస్తున్నాను🙏🙏🙏   

ప, ఫ, బ, భ, మ లను ఏమంటారు… అవి లేకుండా రామాయణం రాశారని మా నాన్న గారు నా చిన్నప్పుడు చెప్పినట్టు గుర్తు… ఎంత మంది ని అడిగినా సరి అయిన జవాబు లేదు.. (రామ పదానికి బదులు దశరధ నందనుడు లాంటివి వాడారని విన్నాను) నిజమేనా ?

*మరింగంటి సింగరాచార్యులు* అనే గొప్ప కవి “నిరోష్ఠ్య రామాయణం” రచించాడు. ఆయన చాలా సుప్రసిద్ధుడు.. తెలంగాణలోని నల్లగొండ జిల్లా, దేవరకొండ ప్రాంతానికి చెందిన 16వశతాబ్దపు కవి. ఆయన వైష్ణవ బ్రాహ్మణుడు. ఇతని తండ్రి వేంగళాచార్యులు. తాత తిరుమలాచార్యులు. 

కవిత్వం ఒక శిల్పం.. మేధావులు తమ నైపుణ్యం చూపుతూ ఇలాంటి రచనలు చేస్తారు. 19 వ శతాబ్దం చివరి వరకూ కూడా ఈ రచనలకు ఆదరణ ఉండేది. ఇవి డిగ్రీలో  పాఠ్యాంశాలు గా కూడా ఉండేవి. వీరేశలింగం గారి *శుద్ధాంధ్ర నిర్వచన నిరోష్ఠ్య నైషధము* ఇందుకు ఒక చక్కని ఒక ఉదాహరణ. “ఓష్ఠము” అంటే పెదవి... ప,ఫ,బ,భ,మ లు ఓష్ఠ్యాలు. ఇవీ మరియు వీటి గుణింతాలూ ఎక్కడా రాకుండా కావ్యం అంతా వ్రాయడం…. ..పైగా “రామాయణం” లో ఎంతో విశేషం. ఇలాంటివే 16 గొప్ప గ్రంథాలు చిత్ర బంధ కవిత్వాలతో కూడినవి రచించి పండితాదరణ పొందాడు సింగన్న.
1520–90 ప్రాంతాలలో  జీవించిన  ఈ కవి ఇబ్రహీం కుతుబ్ షాహీ చేత ఘన సన్మానాలు పొందాడు. *నల యాదవ రాఘవ పాండవీయము* అనే చతురర్థి (ప్రతి పద్యంలోనూ నాలుగు అర్థాలు వస్తూ, నాలుగు కథలు సమాంతరంగా ఒకే కావ్యంలో నడవడం) ఆయన ప్రజ్ఞకు కొలమానంగా నిలుస్తుంది.

Sunday, June 4, 2023

ద్వాదశ జ్యోతర్లిఅగాలు.

అంశం : శ్రీశైల మల్లీశ్వర జ్యోతిర్లింగం: 2.

పాతాళ  గంగయైన క్రిష్ణానదీ తీరము.

ఆది శంకరాచార్యుల శివానందలహరిసారము.

అష్టాదశ శక్తి పీఠములలో ఒకటైన పుణ్య క్షేత్రము.

మల్లికార్జునుడనే పేరుతో జ్యోతిర్లింగంగా శివుని  ఆవిర్భావము.

శ్రీ భ్రమరాంబికాసహిత
శ్రీశైల మల్లికార్జునుని దర్శించి తరించుమీశ్వరీ ॥

**************************************
అంశం : మహాకాళేశ్వర జ్యోతిర్లింగం..3

మధ్యప్రదేశ్‌ , ఉజ్జయినీ పట్టణంలో శ్రీ మహా కాళేశ్వరాలయము.

గర్భగుడిలో  తిరగవేసి ఉన్న శ్రీచక్రయంత్రము.     దక్షిణాభిముఖ ముఖద్వారం  ప్రత్యేకము.

తాంత్రిక మంత్రాలతో ప్రాతఃకాల భస్మాభిషేకము.

మద్యం నైవేద్యంగా, మంత్ర శక్తితో  ఉద్భవించిన ఏకైక స్వయంభూ కాలభైరవ జ్యోతిర్లింగము.

అష్టభైరవులు,ఏకాదశరుద్రులు, వేల దేవతా మందిరాలు గల కృష్ణా నదీ క్షేత్ర దర్శనముతో
జీవితమది ధన్యము గద ఈశ్వరీ ॥

*****************:::::*************

అంశం : ఓంకారేశ్వర్ జోతిర్లింగం. 4.

వింద్య పర్వత సానువుల్లో
నర్మదా నదీతీరంలో వెలసిన ఓంకారేశ్వరుడు .

రెండు భాగములుగా ఉండి,  రెండు పేర్లతో పూజింపబడుతున్న జ్యోతిర్లింగాకారుడు.

ఓంకారేశ్వర  ,అమరేశ్వరు నామాలతో వెలసిన దేముడు .

అన్నపుార్ణ అర్ధాంగిగా కొలవబడుతున్న శివుడు.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఖాండ్వా జిల్లా క్షేత్ర దర్శనంతో
అన్నపుార్ణ కృపకు పాత్రురాలివికమ్ము ఈశ్వరీ .

*****************************:*****

అంశం:*శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగం-5

మహారాష్ట్రలోని పార్లిలో ఉన్న
వైద్యనాధుని , రావణుడు తన పది తలలను
అర్పించి పుాజించిన ఆలయం.

రావణ భక్తికి మెచ్చి గాయపడిన రావణుకి
"వైద్య"మందించిన శివుని ఆలయం.

జార్ఖండ్ రాష్ట్రంలోని చితాభుామియైన  డియోఘర్ ప్రదేశం .

కపాలిక / భైరవ వంటి తాంత్రిక ఆరాధనలకు నిలయం.

శవభస్మ భూషితుడైన వైద్యనాధుని సేవించి తరించుమీశ్వరీ ॥

*********************************::::
అంశం:*శ్రీనాగేశ్వర జ్యోతిర్లింగం-6*

సుప్రియుడనే భక్తుని మొరవిని రాక్షస సంహారార్ధం
జ్యోతి రుాపంలో వెలసిన శివ కాంతిపుంజం.

మొాక్షనగరమైన ద్వారకకు సమీపంలో గల
దారుకావనంలో వెలసిన క్షేత్రం.
 
దారుకావనము నాగులకు నెలవైనందున "నాగేశ్వర"
నామముతో  ప్రసిద్ధికెక్కిన ఆలయం.

నాగారూపమైన జ్యోతిర్లింగ దర్శనం, మహా
పాతక నాశనం ,శాశ్వతపుణ్యలోకవాసం .

.దారుకావనంలో  వెలసిన విశిష్ట "నాగేశ్వర జ్యోతిర్లింగ" దర్శనం, సర్వ శుభములను
ఇచ్చునీశ్వరీ ॥

*********************************::

అంశం: *శ్రీకేదారేశ్వర జ్యోతిర్లింగం-7*

ఉత్తరా ఖండ్ లోని రుద్రప్రయాగలో వెలసిన జ్యోతిర్లింగం

మందాకినీ నది పైభాగంలో మంచు కప్పిన కొండల మధ్య గల పవిత్ర శైవక్షేత్రం.

అక్షయతృతీయ నుండి దీపావళి వరకు భక్తుల సందర్శనార్ధం  తెరచి ఉంచబడే మందిరం.

చార్‌ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఆదిశంకరులచే స్థాపించబడిన శివాలయం.

చార్‌ధామ్‌ యాత్రలో గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్‌నాధ్ లను దర్శించి తరించుమీశ్వరీ..

***************************************
అంశం: *శ్రీత్రయంబకేశ్వర జ్యోతిర్లింగం-8*

బ్రహ్మవిష్ణువుల ప్రార్థనలతో స్వయంభువుగా
వెలసిన మృత్యుంజయుడు శివుడు .

సూర్యుడు, చంద్రుడు, అగ్ని - అనే ముాడు
నేత్రాలు గల దేవుడు.

స్వర్గం, ఆకాశం, భూమి - అనే మూడు స్థానాలకు సంరక్షకుడైనవాడు.

లింగం చుట్టుా నిరంతరం ఊరే ఊట నీరు, కలిసే "కుశావర్తన సరోవరంలో" స్నానం చేసినవారికి సర్వ రోగాలుా, పాపాలుా పోగొట్టేవాడు.

"గోదావరి " పేరుతో పవిత్ర" గంగ" ప్రవహిస్తున్న ,
మహారాష్ట్ర "నాసిక్" లో గల" శ్రీత్రయంబకేశ్వర జ్యోతిర్లింగ" క్షేత్ర దర్శనంతో ధన్యతనొందుమీశ్వరీ ॥

***************************************
అంశం: *శ్రీరామేశ్వర జ్యోతిర్లింగం-9*

"శ్రీరాముడు" సముద్రముపై సేతువు నిర్మించి,
లంకలో గల "దశకంఠుని దునిమిన" స్థలమట.

శైవులకు, వైష్ణవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర
పుణ్య క్షేత్రమట.

"బ్రహ్మ హత్యాపాప" నివారణకై సీతమ్మ చేసిన సైకత లింగమే, శ్రీరాముడు ప్రతిష్టించిన శ్రీ..
"రామనాథేశ్వర" స్వామి జ్యోతిర్లింగమట.

హనుమంతుడు తెచ్చిన" విశ్వలింగము" పక్కనే ప్రతిష్టింపబడడం విశేషమట.

రెండు లింగాలు గల ,ఈ దేవాలయ గర్భగుడిలో మొదట "విశ్వలింగాన్ని" తదుపరి "సైకత" లింగాన్ని, పూజించి తరించుమీశ్వరీ ॥

*************************************
అంశం: *శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం-10*

సహ్యాద్రి కొండ‌ల్లో కృష్ణానది ఉపనదిగా భీమా నదీ ప్రవాహం .

భీమానది ప్రాంతం మైన భావగిరి గ్రామంలో వెలసిన భీమశంకర జ్యోతిర్లింగం .

కుంభకర్ణుని పుత్రుడైన భీమాసురుని భస్మం
చేసిన ఈశ్వరుడి స్వరూపం.

మహారాష్ట్రలోని పుాణేకు సమీపంలో వెలసిన పవిత్ర జ్యోతిర్లింగం .

శాకిని, డాకిని మొదలైన రాక్షస సమూహాలతో నిత్యముా సేవించబడుతుా ఉన్న శ్రీ
భీమశంకరుని దర్శించి తరించుమీశ్వరీ ॥

*****************************:*::*****

అంశం: *శ్రీవిశ్వేశ్వర జ్యోతిర్లింగం-11*

ప్రసిద్ధ కాశీ క్షేత్రంలో నెలకొన్న శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం  .

అక్షత్రయంలో ఒకటైన విశాలాక్షి వెలసిన
అష్టాదశ శక్తి పీఠం, అచటనే నెలకొన్న అన్నపుార్ణాలయం.

వరుణ’, ‘అసి’ నదుల సంగమ గంగలో  
పవిత్ర స్నానం సకల పాప ప్రణాశనం ॥

మొాక్ష  క్షేత్రంమైన కాశీపురిలో, మరణం, అంతిమ
సంస్కారాలు, ముక్తికి సోపానం.॥

విశ్వేశ్వరాన్నపుార్ణలుగా కాశీలో వెలసిన ఆ
శివపార్వతులను దర్శించి తరించుమీశ్వరీ ॥

***********************************

అంశం : శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం(.12)

ఔరంగబాద్‌ జిల్లా, వేరూల్‌ కు సమీపంలో వెలిసిన అతి చిన్న జ్యోతిర్లింగ దేవాలయం.

ఎర్రని రాళ్లపై, పురాణేతిహాస శిల్పకళలు చెక్కిన  24 స్తంభాలపై ప్రధాన ఆలయ సభా మండప నిర్మాణం.

పైన ఐదంచెల శిఖర నిర్మాణం , క్రింద నందీశ్వరుని ఏకశిలా విగ్రహ దర్శనం .

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన
అద్భుత శివక్షేత్రం .
,
ద్వాదశ జ్యోతిర్లింగాలలో చివరిదైన ఈ శ్రీ ఘృష్ణేశ్వరుని దర్శనం చేసుకోనిదే జ్యోతిర్లింగయాత్ర పరిపుార్ణముగాదటీశ్వరీ ॥

****************************************