Thursday, February 17, 2022

మహిళాదినోత్సవ సందర్భంగా "మహిళ మహారాణి" కొరకు రాసిన వచనం.

నమస్కారం..🙏
నా పేరు శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర లో ఉంటాను.

నాటినుండి నేటి వరకు గల చరిత్రలో ,
ఎందరో మహిళామణులు విద్య , వైద్య,  న్యాయ ,
సంగీత , సాహిత్యాది అనేక కళా రంగాలలోనే గాక ,
శాస్త్ర  సాంకేతిక వైజ్ఞానిక, రాజకీయ, స్వాతంత్ర్యాది
ఉద్యమాల లో పాల్గొని , తమ విశిష్ట ప్రతిభను 
చాటుకున్నారు.
వారందరుా మన భరతమాత కీర్తి కిరీటంలో 
కలికితురాయిలై , నేటికీ  చరిత్ర పుటల్లో
మహిళా శక్తికి స్ఫుార్తిదాయకులై నిలచేరు. 

జాతీయ మరియు అంతర్జాతీయ మహిళా-
దినోత్సవాల సందర్భంగా , సాహితీ బృందావన జాతీయ వేదికవారు నిర్వహిస్తున్న
 " మగువ మహారాణి " పోటీలకుగాను
 నేను తీసుకున్న అంశం నాటి మహిళా రత్నమైన
 శ్రీ " దుర్గాబాయి దేశ్ ముఖ్ " గారిది.

ఈమె మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబీకులైన
రామారావు క్రిష్ణవేణమ్మ  దంపతులకు రాజమండ్రిలో
జన్మించారు.
8 సంవత్సరముల వయస్సు లో ఆమెను ఆమె తల్లిదండ్రులు , ఆమె మేనమామకు ఇచ్చి వివాహం చేయ నిశ్ఛయించగా, ఆ వయసులోనే ఆమె ఆ వివాహాన్ని తిరస్కరించేరు.
12 సంవత్సరాల వయసుకే ఆమె హిందీ పాండిత్యాన్ని
సంపాదించి , రాజమండ్రిలో హిందీ పాఠశాలను
నెలకొల్పి , అన్ని వయసులవారికీ విద్యా బోధనను 
చేసేరు

మహాత్మాగాంధీగారు ఆంధ్రా పర్యటనకు వస్తున్నారని తెలిసిన  ఆమె ఎనలేని విరాళాలను సేకరించి ,
వాటితోపాటు ఆమె చేతికున్న బంగారు గాజులను కుాడా స్వాతంత్ర్య పోరాట విరాళంగా సమర్పించేరు.
ఆంధ్రా పర్యటనలో గాంధీగారు చేసిన హిందీ ఉపన్యాసాలను , తెలుగులోనికి అనువదించి 
ఆయన  ప్రశంసలను పొందేరు.
ఉప్పు సత్యాగ్రహంలో అరెస్టు కాబడి కుాడా , 
స్వాతంత్ర్యోద్యమాలలో  పాల్గొన్న ధీర వనిత
శ్రీ  దుర్గాబాయి దేశ్‌ముఖ్ గారు.
ఇన్ని చేస్తుా కుాడా ఆమె తన చదువుకు ఆటంకం రానీయలేదు. విరామసమయాల్లో అమె చదువుకుంటుా  తన విద్యను సకాలంలో పుార్తిచేసి, 
న్యాయ కోవిదురాలిగా , ప్రఖ్యాత క్రిమినల్ లాయర్  గా
జగద్విఖ్యాతిగాంచేరు.

అనేక సాంఘీక సంక్షేమ  సంస్థలను ప్రారంభించి
స్త్రీ ల అభ్యున్నతికి కృషి చేసేరు.
చెన్నై లో ఆంధ్ర మహిళా సభను  
లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ అనే బాల సంఘాన్ని
స్థాపించేరు.
ఆంధ్ర  విద్యాలయంలో మహిళా వసతి గృహాలను, హైదరాబాదులో  ఆంధ్ర మహిళా పత్రికను స్థాపించి
దానికి  సంపాదకత్వాన్ని వహించేరు.
రాష్ట్రమంతటా   ఎన్నో కళాశాలలు, వసతి గృహాలుా,
నర్సింగ్ హోమ్ లు, వృత్తి కేంద్రాలు నెలకొల్పారు.
చెన్నై లో 70 మంది కార్యకర్తలతో  ఉదయవనం అనే
సత్యాగ్రహ సిబిరాన్ని ఏర్పరచేరు.
స్వాతంత్ర్యానంతరం అమె భారత రాజ్యాంగ నిర్మాణ 
సభలోసభ్యురాలిగా పనిచేసేరు.
అటుపై C D దేశ్‌ముఖ్  గారితో వివాహానంతరం
అమె సాక్షారతాభవన్ ను స్థాపించగా..
ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ఈమెకు గౌరవ
డాక్టరేట్ ను ప్రదానం చేసేరు.
పిదప భారత ప్రభుత్వంచే నెలకొల్పబడిన
కేంద్ర సాంఘీక సంక్షేమ బోర్డ్ కు , దిల్లీ లో ఉన్న
బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ లకు అద్యక్షురాలిగా
పని చేసారు.

కేంద్ర సాంఘీక సంక్షేమ బోర్డ్  వారు ఈమెకు 1998లో
ఈమె పేరున " డాక్టర్ దుర్గాబాయి దేశ్‌ముఖ్" వార్షిక అవార్డు ను నెలకొల్పి , దానిని మహిళా అభ్యున్నతికి
పాటుపడే స్వశ్ఛంద సంస్థలకై వినియొాగపరిచేరు.

దిల్లీ లో ఉన్న  బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ వారు
2006లో ఈమె పేరున "దుర్గాబాయి దేశ్‌ముఖ్ -
కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్" ను నెలకొల్పారు.

ఇలా ఒక స్త్రీ గా, పిన్న వయసు నుండి కుాడా దేశానికి
ఎనలేని సేవలందించిన గౌరవనీయులు 
శ్రీ దుర్గాబాయి దేశ్‌ముఖ్  గారు 1981 మే వ తారీఖున
హైదరాబాదు లో దివంగతులై భరత మాత కీర్తి కిరీటంలో మణిరత్నమై చిరస్మరణీయులయ్యేరు.

"మగువ మహారాణి " పేరుతో మహిళలకు
అత్యున్నత వేదికను కల్పించి , మహోన్నతమైన మహిళా మణుల వీర చరితల సంస్మరణతో, మహిళా శక్తిని జాగృత  పరచే విధంగా , వచన, కవితా గానాలను చేసే అవకాశాలను కల్పిస్తుా ప్రోత్సహిస్తున్న 
సున్నితం ప్రక్రియ రుాపకర్త ,సాహిత్య పోషిణులుా ఐన గౌరవనీయులు శ్రీ నెల్లుట్ల సునీతగారికి , ఆమెకు సహకరిస్తుా కవులను ఉత్సాహపరుస్తున్న 
యుాట్యుాబ్ ఛానల్ నిర్వాహకులు
గౌరవనీయులైన శ్రీ దేవవరపు ఈశ్వర రావుగారికి
సాదర నమస్కారములతో
నా మనఃపుార్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

Monday, February 14, 2022

గజల్ రాయడం ఎలా...? వివరణ....

[7/27/2021, 10:47] ఇష్టపది సత్యం మాష్టారు: *పరిశీలించండి* 

 *లేదుకదా..,...... రధీఫ్....6 మాత్రలు* 

 *దాటేదీ* 
 *గొప్పేదీ* 
 *ఎదురేదీ* 
 *మిన్నేదీ* 
 *మిన్నేదీ* ......... *ఖాఫియాలు* 

మొదటి షేర్ మత్లాను

అలాగే ప్రతి షేర్ నియమాలను 
గమనిస్తూ భావం ఉట్టిపడే గజల్ రాయగలరు

మనకంతా మమతదారి *దాటేదీ*  *లేదుకదా* 
మంచిమనసు కన్నమించి *గొప్పేదీ*  *లేదుకదా*

ప్రేమకున్న  విలువకన్న ఏమున్నది వెదికినంత
ఎదగుడిలో నింపుకున్న *ఎదురేదీ* *లేదుకదా* 

పేగుపంచి పెంచినట్టి తనకన్నా గొప్పెవరూ
అమ్మ మనకు దైవమేను *మిన్నేదీ* *లేదుకదా*

పుట్టినిల్లు మెట్టినిల్లు గౌరవాన్ని ఇనుమడించె
మగువ మనసు మించిపోయి *ఇంకేదీ* *లేదుకదా*

ఆడపిల్ల నడియాడే ఇల్లంతా బంగారము 
*రామ* నవమి నాటిమాట *దాటేదీ* *లేదుకదా*
[7/27/2021, 10:49] ఇష్టపది సత్యం మాష్టారు: శుభోదయం
గజల్ రాయాలని ఇష్టం, పట్టుదల  ఉన్నందున తప్పక చక్కగ రాయగలరు..

మీ కోసం ఈ క్రింది వివరాలు..

గజల్ వ్రాయడమెలా ?
*******************
మొదట 
గురులఘువులు గుర్తించడం తెలియాలి.
గురువులు: 
దీర్ఘాక్షరాలు, 
కా కీ కూ కే కో 
కై కౌ ( ఐ ఔ చేరిన అక్షరాలు )
కం గం నిం - సున్న చేరినవి
విసర్గ తేరిన అక్షరాలు దుః 
సంయుక్తాక్షరానికీ ద్విత్వానికి ముందున్న అక్షరాలు
సున్న - సు గురువు
లక్క - లగురువు
పత్తి - ప గురువు
సత్య- స గురువు
పద్య - ప గురువు
విజ్ఞ - వి గురువు 
ఇక
ఏవి లఘువులు - మిగిలినవి 
మరి ఇక...
గజల్ లో గణాలు ఉండవు . మాత్రలు తెలియాలి
గురువు -2 మాత్రలు
లఘువు - 1 మాత్ర
3 మాత్రల పదాలైతే త్రిస్రగతి
4 మాత్రల పదాలై తే చతురస్ర గతి
5 మాత్రల పదాలు వాడితే ఖండగతి
రెండు రకాల గతులు కలిపితే మిశ్రగతి

ఉదా: 
3 మాత్రలు- రామ
4 మాత్రలు - రాముడు
5 మాత్రలు- రాముడే

 3+ 3 =6 - కలిసి సాగు
4+4 =8 - కదిలే కాలం
3+4 = 7 -కలల అలజడి 
ఇలా పదం తయారు చేసుకోవచ్చు 

గజల్ కు శీర్షిక‌ ఉండదు‌ వచన కవిత లా..

మత్లా = గజల్ లో మొదటి ద్విపద ( రెండు పాదాలు)
ఉదా
గుండెభాష నీకంతా తెలుసునులే కంటికొలికి
వెలుగంతా నింపుకునీ మెరియునులే కంటికొలికి

ఇందులో 
కంటికొలికి : రదీఫ్ అంటారు. 
తెలుసునులే, మెరియునులే..( చివర '..నులే' గుర్తించండి)వీటిని ఖాఫియా అంటారు

షేర్ = గజలలోని మిగిలిన ద్విపదలు..
ఇందులో మొదటి పాదం కేవలం మాత్రలు పాటిస్తూ 
సాగుతుంది. దీనిలో తెలుసునులె వంటి కాఫియా -కంటికొలికి వంటి రదీఫ్ అక్కరలేదు
రెండవ పాదం మత్లాలోని విధంగా కాఫియా, రదీఫ్ తో  రాయాలి 
ఉదా 
మూగభాష లోతెంతో నినుచూసిన చాలంతే 
మౌనంలో అర్దమెంతొ వొలుకునులే కంటికొలికి

ఇలా మత్లా‌, షేర్లు కలిపి, 5, 7, 9....ద్విపద లుగా రాస్తారు.
అన్ని ద్విపదాలూ ఒకే‌అంశం మీద రాయాలసిన‌ అవసరం లేదు..పలు అంశాల‌పై‌రాసి‌ ఒక గజల్‌ గా కూర్చవచ్చు..

చివరి ద్విపదలో కవి పేరు ( తఖల్లూస్) వచ్చేలా చూస్తే గజల్ ఎవరిదని తెలుసుకోవచ్చు. 
ఉదా: 
కనురెప్పల బంధంలో మరచిపోని సంగతులే
"రామ"శరము సంధిస్తూ వదులునులే కంటికొలికి

ఇక 
ఓ పూర్తి గజల్ ఇక్కడ : ( మీకు నచ్చుతుందో లేదో తెలియదు ..కానీ కింద పోస్ట్ చేస్తున్నా ..సరళంగా)

గుండెభాష నీకంతా తెలుసునులే కంటికొలికి
వెలుగంతా నింపుకునీ మెరియునులే కంటికొలికి

మూగభాష లోతెంతో నినుచూసిన చాలంతే 
మౌనంలో అర్దమెంతొ వొలుకునులే కంటికొలికి

మంత్రమేదొ వేస్తావుగ నీదరినే చేరినంత
మరలిపోని కథనంతా చూపునులే కంటికొలికి

చీకటినే చీల్చినీవు అందమంత అద్దినావు
కలవరింత కలలెన్నో కదులునులే కంటికొలికి

కనురెప్పల బంధంలో మరచిపోని సంగతులే
రామశరము సంధిస్తూ వదులునులే కంటికొలికి
@@@@@@@@@@@
ఇందులో 
రదీఫ్ : కంటికొలికి
ఖాఫియా: తెలుసునులే,మెరియునులే,వొలుకునులే,చూపునులే,
కదులునులే,వదులునులే..

తఖల్లూస్: రామ‌  ( రామశర్మ పేరుగా)

గతి: 6-6-6-6

Note: 
1.
గజల్ బేసిక్స్ మాత్రమే ఇచ్చాను confusion ఉండకూడదని...
2. గజల్ లో కొంత స్వేచ్ఛ ( మరీ ఎక్కువగా కాదు) ఉదాహరణకు  'అర్ధమెంతొ ' అని రాయవచ్చు "అర్ధమెంతో ' బదులుగా ...వచన కవితలో ఐతే ఇలా రాయకూడదు. ఇదొక పదం ఉదాహరణ.
3. గజల్ లో తఖల్లూస్ ఉండకపోయినా పరవాలేదు 
4. వేరే రూపంలోనూ ఉన్న గజల్స్ మరోసారి..

ధన్యవాదాలు
[7/27/2021, 15:56] ఇష్టపది సత్యం మాష్టారు: రధీఫ్ ముందు వచ్చే కాఫియాలు ఒకే ప్రాసలో లేవండీ
[7/27/2021, 15:57] ఇష్టపది సత్యం మాష్టారు: అందాలె బంధాలె చెందాలె కందాలె... ఇలా
[7/27/2021, 17:23] p3: ప్రక్రియ : గజల్.



శీర్షిక  :   నా ప్రేమ.


ఎదలోన మెదిలేను భావాల అలజడీ
ఎందెందు దాగె నీ అందాలె  నాచెలీ

ఊహలే ఉయ్యాలలుాగేను మదిలోన 
బ్రతుకంత నీ తలపు బంధాలె నాచెలీ 

నీ పలుకు లేతీపి తేనీటి జల్లులై
కురిసేను నీప్రేమ గంధాలె నాచెలీ

 నీమొాము లోనిండెనాచంద్ర కళలవే ఆకళలె కలలంద చందాలె నాచెలీ

కదిలేటి ముంగురులె మేఘసందేశమై
కవ్వించ ననుచేరు కందాలె నాచెలి

 కనులలో కదలేటి నీమౌన బాసలే
నీప్రేమ పంచేత రంగాలె  నాచెలీ

నీ ప్రేమ తెలిసేను నిన్ను నే వలచేను
నా వలపు వర్ణనలభంగాలు నాచెలీ

శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర
8097622021.
[7/27/2021, 17:25] ఇష్టపది సత్యం మాష్టారు: 👌👌
[7/27/2021, 17:34] ఇష్టపది సత్యం మాష్టారు: అన్ని కాఫియాల శబ్దం లె వస్తే.. ఈ పాదంలో లు వస్తుంది అండీ.
గజల్ లో శబ్ద ప్రాధాన్యత (ఉచ్ఛారణ) ఉంటుంది అండీ
[7/27/2021, 18:13] p3: శీర్షిక  :   నా ప్రేమ. 


ఎదలోన మెదిలేను భావాల అలజడీ
ఎందెందు దాగె నీ అందాలు  నాచెలీ

ఊహలే ఉయ్యాలలుాగేను మదిలోన 
బ్రతుకంత నీ తలపు బంధాలు నాచెలీ 

నీ పలుకు లేతీపి తేనీటి జల్లులై
కురిసేను నీప్రేమ గంధాలు నాచెలీ

 నీమొాము లోనిండెనాచంద్ర కళలవే
 ఆకళలె కలలందచందాలు నాచెలీ

కదిలేటి ముంగురులె మేఘ సందేశమై
కవ్వించ ననుచేరు కందాలు నాచెలి

 కనులలో కదలేటి నీమౌన బాసలే
నీప్రేమ పంచేతరంగాలు  నాచెలీ

నీ ప్రేమ తెలిసేను నిన్నునే వలచేను
నా వలపు వర్ణనలభంగాలు నాచెలీ

సఖినీదు ఈశ్వరీ సరదాగ వినిపించె
వయ్యారి నీసొగసు విందులుా నాచెలీ

అందాలె నాబ్రతుకు బంధమై పోయెలే
నాతోడు వైవేయు సంకెళ్ళు  నాచెలీ

శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర
8097622021.
[7/27/2021, 21:49] p3: ప్రక్రియ : గజల్ ..
శీర్షిక : అలనాటి  జ్ఞాపకాలు .


అలనాటి రోజులని తలచేవు ఏలనీ
మారింది నీవనీ తెలుసుకోవేలనీ..

ఆగాలి ఆనీరు  ఆపుడమి ప్రకృతీ
ఆనాటి వేననీ  తలుచుకోవేలనీ ॥

బంధాలె బరువాయె ఈనాటి మనిషికీ
విడరాని బంధాల కలుపుకోవేలనీ  ॥

ఆ అమ్మ ఆ అక్క ఆచెల్లి  ఆచెలీ
ఆప్రేమ నీదిగా మసలుకోవేమనీ ॥

స్వార్ధమే జీవముా ధనమాయె ముాలముా
నిస్వార్ధ బాటలో నడుచుకోవేలనీ  ॥

కరువాయె ధర్మముా  బరువాయె బంధముా
అవినితి బాటనే  వదుకోవేలనీ ॥

తరిగేను విలువలుా తొలగేను వలువలుా 
మనదైన సంస్కృతిని మరచేవు ఏలనీ ॥

మేధావి తానని  మారినది మనిషనీ
తెలిసినీ తలపులను మార్చుకోవేలనీ ॥

ఆనాటి కాలమే ఈనాడు ఉండగా
కాలాన్ని తిరగేసి వగచేవు ఏలనీ॥


శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర
8097622021.


హామీ:
ఈ నా  "గజల్ " ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన .
[7/27/2021, 23:05] ఇష్టపది సత్యం మాష్టారు: ఇది ఓకే అండీ.. నా చెలీ కి ముందు తప్పక లు లేదా లె ఒకే అక్షరం వచ్చే విధంగా చూడండి.
[8/17/2021, 17:28] ఇష్టపది సత్యం మాష్టారు: దుర్నీతుల దురాచార దుశ్శాసన  పాలనలో
నిశ్ఛయమౌ నియమమేది యసలులేదు  ఈజగాన ॥

అన్యాయపు అక్రమాల అగడాల సమాజాన
స్వార్ధమేలు మనిషికేమొ సుఖములేదు ఈజగాన ॥

వయసుమీర తల్లితండ్రి బరువాయెను బ్రతుకులోన
కన్నపేగె ,కాలరాసె , వలపులేదు ఈజగాన ॥

ఆడతనము అమ్మతనము అప్పచెల్లి అన్నమాట
వావివరుస బంధమన్న మాటలేదు ఈజగాన ॥

అవినీతులె రాజ్యమేలె ఆదర్శమె అణగారే
న్యాయమైన ధర్మమైన బాటలేదు  ఈజగాన ॥
[10/15/2021, 13:37] p3: [10/14, 19:14] p3: తెలుగు వెలుగు సాహిత్యవేదిక ..కొరకు'
గురువారం: 14/10/2021.
అంశం : ఐచ్ఛికం.

రచన : శ్రీమతి:  పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

ప్రక్రియ : గజల్.

శీర్షిక : నీలాల ఆకాశంలో....

నీలాల ఆకాశంలో నేనో చిరు తారకనై
నెలరేయి వెన్నెల వెలుగై కురవాలని ఉన్నది॥

వేవేల మువ్వల సడిలో రాగాల గీతికనై
శృతి నిండిన పల్లవి నేనై పాడాలని ఉన్నది.॥

మరుమల్లె గంధం నేనై సందేశపు ప్రేమకు తావై
చిరుగాలుల చల్లని వీచిగ సాగాలని ఉన్నది.॥

పాటల్ల పల్లకి లోనా పరువాల కన్నెను నేనై
వాడల్ల నాదపు సిరినై కురవాలని ఉన్నది॥
తాళాల పదగతి నేనై ఆడాలని ఉన్నది॥

నాట్యాల నవరస భావం వాద్యాల వలపుల తాపం
సందేళ మురళిని నేనై  పలకాలని ఉన్నది.॥

ఈశ్వరీయ కలల అలల వేణునాద తరంగాల
ఆమాధవ చరణాలను తాకాలని ఉన్నది ॥
[10/14, 22:51] +91 6305 543 917: 1️⃣3️⃣పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు! వెన్నెల వెలుగు గా,రాగాల గీతిక గా,మరుమల్లే సందేశం గా,పాటల పల్లకి లో పరువాల  కన్నేనై....వర్ణన అద్భుత: కా నీ మీరు,విరహం సూఫీ తత్వం పట్టు కోవడం లేదు..అప్పుడు గజల్ కి ప్రాణం వస్తుంది. ఈ సారి వ్రాస్తారు కదా! చప్పట్లు. 👏👏👏👏👏👏💐👌💐👍🌷
[10/15/2021, 13:38] p3: మాష్టారుా ..ఈ సుాఫీ తత్వం  అంటే ఏమిటో తెలియజేయగలరా ..ప్లీజ్
[10/15/2021, 13:39] p3: పై న నేనురాదిన గజల్ , దానికింద ఒక సమీక్ష  ఉన్నాది గమనించి వివరించ ప్రార్ధన..🙏
[10/15/2021, 13:47] ఇష్టపది సత్యం మాష్టారు: భగవంతునిపై ప్రేమ , భగవంతునిలో సంలీనమైన భావనతో రాయడం అండీ.. రచనలో ప్రేమ , భక్తి ఒకేసారి కనిపించాలి.. ప్రియుని గురించి రాసినా భగవంతుడు, భగవంతుని గురించి రాసినా ప్రియుడు పదాలలో కనిపించాలి. నాకు అర్ధం అయింది ఇదీ మేడమ్ సూఫీతత్వం గురించి. 🙏🙏
[10/15/2021, 13:49] ఇష్టపది సత్యం మాష్టారు: మీ గజల్ లో అంతర్లీనంగా విరహవేదన , సూఫీతత్వం కనిపిస్తున్నది. 👌👌


***************

[10/15/2021, 16:29] +91 6305 543 917: మిత్రులకు సాహితీ వందనం....
ఈరోజు ప్రజాశక్తి దినపత్రికలో 'సురారం శంకర్' గారి 'సౌపర్ణిక' గజల్ సంపుటి పై నేను రాసిన సమీక్ష.....తప్పకుండా చదవండి....
పత్రిక యాజమాన్యానికి చాలా ధన్యవాదాలు...🙏

🌷 హృదయ కాంతుల మెరుపు సౌపర్ణిక 🌷

శబ్ద సౌందర్యంతో కూడిన కవిత్వం వినసొంపుగా ఉంటుంది...
అందులో అద్భుతమైన భావం ఇమిడి ఉంటే మనోహరంగా ఉంటుంది....
లయగా సాగుతున్న కవిత్వాన్ని చదువుతున్నప్పుడు....పెదవులు పాటలాగా పాడాలని మారాం చేస్తాయి...మనసైతే భద్రపరచుకుని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటుంది...

గజల్ ప్రక్రియకు ఈ అద్భుతమైన లక్షణాలన్నీ ఉన్నందువల్లేమో కవులు తమ భాషల్లో గజల్ సౌందర్యాన్ని ప్రవహింపజేస్తున్నారు....

గజల్ మొదట అరబ్బీ, పర్షియన్ భాషల్లో మొదలైనా ఇప్పుడు ప్రపంచమంతా విస్తరిస్తోంది...ఇది మాత్రా ఛందస్సు తో కూడిన ప్రక్రియ....

పంక్తుల జతను షేర్ అంటారు. మొదటి షేర్ ను మత్లా....చివరి షేర్ ను మక్తా అంటారు...చివరి షేర్ లో రచయిత తన పేరును చెప్పుకోవడం ఆనవాయితీగా వస్తోంది....దీనిని తఖల్లుస్ అంటారు...ఆ పేరు కూడా భావంలో ఇమిడి పోవాలి...
గజల్ లోని భావవ్యక్తీకరణలో చమత్కారం ముఖ్యం...గజల్ లో వస్తువు ముఖ్యంగా ప్రేమ, విరహం , తాత్వికత ఉంటుంది...విరహాన్ని మరీ దుఃఖిస్తున్నట్లుగా కాకుండా కాస్త ప్రేమలో ముంచి రాస్తే మరింతగా గుభాళిస్తుంది....

ఇప్పుడు 'సౌపర్ణిక' లోని కొన్ని షేర్లను పరిచయం చేస్తున్నాను

//మనసును ఎందుకు మరిమరి మరిమరి భ్రమ పెట్టుకుంటామో తెలియదు
'చిరుగును' చూసి 'చిగురని' ఎందుకు ఒప్పేసుకుంటామో తెలియదు//ఈ మత్లా లో  మనసు పడే వేదన గురించి హృద్యంగా రాశారు....ఒక్కోసారి కళ్ళ ముందు నిజం కనిపిస్తున్నా...మనం ఒప్పుకోము...మనకు నచ్చిన విధంగానే జరుగుతున్నట్లు భ్రమలో ఉంటాము...అలాంటప్పుడే చిరుగులు కూడా చిగురులుగా కనిపిస్తాయి...కానీ ఇది కూడా గాయ పడిన మనసుకు ఊరటే....

//నిలిచిపోయే పాటనే ఇల 'రాసి' వెళతాను
గుండె మీటే మాటకే 'ఓటేసి' వెళతాను
సత్యమేదో తెలిసినాక సంకెలల బ్రతుకెందుకు 
స్వార్థ చింతన నిక్కడే 'వదిలేసి' వెళతాను//...ఈ గజల్ లో మంచి తాత్వికత ఉంది...
మన జీవితం ఎప్పుడూ ఇతరులకు ఆదర్శవంతంగా ఉండాలి...మనం ఇంక లేము అని తెలిసినప్పుడు మన మాటలు మన మంచితనం కొన్నాళ్ళ వరకైనా అందరికీ గుర్తుండి పోవాలి. అందుకే మనిషి స్వార్థాన్ని వదులుకోవాలని కవి అంటున్నారు....ఇందులోనే నాలుగవ షేర్లో ఇలా అంటున్నారు...
//కోటి జన్మలు ఎత్తినా, ఈ కోరికల సడి తీరునా?
సంతృప్తి పాదును ఇప్పుడే 'సరిచేసి' వెళతాను// ....ఎంత గొప్ప భావం....మనిషిలో కోరికలెప్పుడూ సడి చేస్తూనే ఉంటాయి , అందుకే మనం ఉన్న దాంతోనే సంతృప్తి పడడం నేర్చుకోవాలంటున్నారు....

 //చిరునవ్వు కన్నా అందమైన 'స్వాగతం' ఉందా?
బాల్యాని కన్నా మధురమైన 'జ్ఞాపకం' ఉందా?//....చక్కగా చెప్పారు చిరునవ్వు కన్నా మించిన స్వాగతం లేదు అలాగే చిరునవ్వు కన్నా మించిన ఆభరణమూ లేదు...మనసులో ఎంత బాధ ఉన్నా కొద్ది మంది పెదవులపై చిరునవ్వు చెక్కు చెదరదు...ఒక్కోసారి బాధలను ఎదుర్కొనే శక్తి కూడా మనకు ఆ చిరునవ్వే ఇస్తుంది...అందుకే చిరునవ్వును ఎవరూ దూరం చేసుకోకూడదు...మోవికి అందాన్ని ఇస్తుంది....అలాగే ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఇంక అందులోనే కవి అంటున్నారు బాల్యానికన్నా మధురమైన జ్ఞాపకం ఉందా అని...ఎవరికీ ఉండదు అంతకన్నా మధురమైన జ్ఞాపకం....

//నా పూలతోటలో పూలన్నీ ఎవరో 'త్రుంచుకు' వెళ్ళారు
మధురోహల నా ఏకాంతాలను ఎవరో 'దోచుకు' వెళ్ళారు//...ఎంత అందమైన భావవ్యక్తీకరణ....నా తోటలోని పూలన్నీ ఎవరో తుంచేశారు....అచ్చంగా నేను ఊహల్లో విహరిస్తుంటే నా ఏకాంతాలను ఎవరో దోచుకు వెళ్ళినట్లుగా అంటున్నారు...ఏకాంతాలను పూలతో పోల్చడం ఎంతో బాగుంది.

//ఎపుడో అపుడు నువ్వూ నేనూ 'కలువక' పోతామా?
ఇద్దరి ఎడదల పొగిలిన సుద్దులు 'నుడువక' పోతామా? //....ఎవరికైనా ఈ వాక్యాలు నచ్చుతాయి...
నువ్వూ నేనూ నింగి నేలా ఏమీ కాము కదా కలువక పోవడానికి...ఎపుడో ఒకప్పుడు తప్పక కలుస్తాము ఆక్షణం ఇన్నాళ్లూ మన ఇరువురి హృదయాలలో దాచుకున్న  ఊసులన్నింటినీ ఒకరికొకరం వినిపించుకుంటాము....
ఇందులోనే ఇంకో షేర్లో ఇలా అంటున్నారు...
//నీదో గమ్యం నాదో గమ్యం, ఇద్దరి మధ్య అగాధం
అయినా ఒకరికి ఒకరం మనసుని 'చాటక పోతామా' ?// ....నీ గమ్యం వేరు నా గమ్యం వేరు మళ్ళీ ఇద్దరి మధ్యన పెద్ద అగాధం ఉంది అయినా కూడా ఎప్పటికైనా మన మనసులు మళ్ళీ ఒకటవకుండా ఉంటాయా అని అనడంలో గొప్ప ఆశావాద దృక్పథం ఉంది....ప్రేమ విఫలమైతే చావాల్సిన అవసరం లేదు....ఎదురు చూద్దాం ఎప్పటికైనా కలుస్తామనే ఆశతో....లేదా మనసులో ఉన్న వాళ్ళ జ్ఞాపకాలతోనైనా జీవిద్దాం...

//జాబిల్లికి చెయ్యందిస్తే నీతో కరచాలనమే
హరివిల్లుకు హృదయాన్నిస్తే నీతో నా పరిచయమే//...ఎంత మధురంగా ఉందీ షేర్....ఆమెతో స్నేహం జాబిల్లికి చేయందించినట్లుగా , ఆమెతో పరిచయం హరివిల్లుకు హృదయాన్నిచ్చినట్లుగా ఉంది అంటూ అందమైన పోలికలతో చెప్పారు...
ఇందులోనే ఇంకో షేర్....
//ఈ లోకం పచ్చిక నిండా నీ పద ముద్రలే
చిరుగాలికి ముచ్చట చెబితే నీతో సంభాషణమే//.....ఈ లోకం పచ్చిక నిండా నీ పదముద్రలే అంటే ఆమె నడిచే దారంతా వసంతం పరచుకుంటోందని, గాలితో చెప్పే మాటలన్నీ నీతో మాట్లాడినట్లే ఉంటుంది అనడం లో గాఢమైన అనురాగం దాగి ఉంది....

//ఏ అక్షరానికి తెలియదు తన 'ఉనికి బలమెంతో'
ఏ పావురానికి తోచదు తన 'రెక్కల బలమెంతో' //....
నిజమే కదా అక్షరాలకున్న బలం ఎంతటిదో ఎవరికీ తెలియదు....అదే విధంగా ఎవరి శక్తి వాళ్ళకు ఎప్పటికీ తెలియదు....కాలమే అన్నింటినీ తెలియజేస్తుంది....కొన్ని సార్లు మనం నిమిత్త మాత్రులుగానే ఉండిపోవాలి. 

ఈ 'సౌపర్ణిక' సంపుటిలోని ప్రతి గజల్ అద్భుతంగా ఉంది....తేనె ధారల్లో తడిసిన భావన కలుగుతుంది ఎవరికైనా...ప్రతి గజల్ ని  రెండు సార్లు చదవాలనిపించేంత చక్కగా ఉంది...

మంచి గజళ్ళు చదువుతుంటే మనసును సున్నితమైన పరిమళమేదో చుట్టుకున్న భావన కలుగుతుంది....ఇంకాసేపు చదవాలనే కోరిక కలుగుతుంది...అచ్చంగా సూరారం శంకర్ రచించిన 'సౌపర్ణిక' గజల్ సంపుటి లాగానే....

మరెన్నో అద్భుతమైన పుస్తకాలను పాఠకలోకానికి అందివ్వాలని కోరుకుంటూ సురారం శంకర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను.

సమీక్షకురాలు
శాంతి కృష్ణ, గుoటూరు.
[10/15/2021, 16:29] +91 6305 543 917: ---( పాత పోస్ట్... ఫేస్బుక్ గుర్తు చేసింది. కొత్త మిత్రుల కోసం మళ్ళీ... ఇదివరకే చదివినవారు అసహనానికి గురి కావద్దని మనవి-------------------)
--------------------
గజల్ తరంగిణి (వ్యాసాలు)
----------------------
--------- " మిథున కవితా వనం " ద్వారా Madam Leela kay & అడ్మిన్స్ పర్యవేక్షణలో ప్రతి శుక్రవారం నిర్వహించబడుతున్న ధారావాహికకు స్వాగతం ... !  సు స్వాగతం ... !! 

--------- గతవారం తరువాయి---- 

------------- గతవారం గజల్ ఛందస్సు గురించి కొంత మేర తెలుసుకున్నాం--- 

------  ఉరుదు గజల్ ఛందస్సు నుండి  తెలుగు భాషా  పరిమితులకు ఒదిగేంత మేర  ఉరుదూ ఛందస్సును మాత్రమే మనం  గ్రహించినాము .. అంతకు మించి అనగా పూర్తి స్థాయి ఉరుదూ గజల్ ఛందస్సును ఉన్నదున్నట్లు మనం  తెలుగులో  ఉపయోగించుకోవడం లేదనీ , ఆ అవసరం కూడా మనకు లేదనీ నా పరిశీలనలో తెలియవచ్చిన నిజం..  

ఉదా।।

---------- ఉరుదూలో గణాన్ని " రుక్న్ "మ అంటారు . గణాలను " ఇర్ కాన్ " అంటారు. 

------- ఉరుదూ లో 5 మాత్రల గణాలు =2 , ( 1) ఫఊలున్ --- ( తెెలుగులో " య "గణము  IUU . )  ఫ=। , ఊ= U, లున్ =  U , -----అలాగే , (2) ఫాయిలున్ . తెలుగులో ఇది "ర" గణము UIU , 

----------  7 మాత్రల గణాలు =5 , 
1) ముస్త ఫయిలున్  UI II U (  తెలుగులో  గణము లేదు ) 

2) మఫయిలున్ IIIU ( do) 

3) ఫాయిలాతున్ UIUU (do ) 

4) ముత్ ఫాయిలున్ U U IU (do)

5) మఫ ఉలాన్ IIIU ( do ) 

(** Note := పై గణాలలోని గురు లఘువులను నేను తెలుగు భాషా ఛందస్సును అనుసరించి గణించినాను . ఉరుదూ ఛందస్సు ప్రకారం అయితే ప్రతి పొన్ను అక్షరం ఒక లఘువు I గా గణించవలసి ఉంటుంది . అలా రాస్తే కొందరు Confuse అవుతారని రాయలేదు. ) 

------ పై గణాలతో బహర్ లు ఏర్పడ్డాయి..  అవి సుమారు  19వరకు ఉన్నాయని పెన్నా గారు పేర్కొన్నారు ... అవి వరుసగా -------- 

1) హజజ్
2) రజజ్ 
3) రమల్
4) ముత్ కారిబ్ 
5)ముత్ దారిక్ 
6) కామిల్ 
7)వాఫర్ 
8) మున్ సరహ్ 
9) ముజారా 
10)సరీఅ 
11) ఖఫీఫ్ 
12) ముజత్తాన్ 
13) ముక్త జబ్ 
14) తవీల్ 
15) మదీద్ 
16) బసీత్ 
17)  జదీద్ 
18) కరీబ్ 
19) మశాకిల్ 

Note := ఇవే కాకండా మాత్రల హెచ్చు తగ్గులతో మరిన్ని బహర్ ఏర్పరచుకున్నారు.

------------- పైన పేర్కొనిన  ఉరుదూ ఛందస్సు నిబంధనలు., బహర్ లు పాఠించడంలో మనకు ఏమాత్రం సౌలభ్యత లేదు 1,2 మినహా ---- మరో ముఖ్య  విషయం -- ఉరుదూలో   పొన్నును ( ్ )  ఒక మాత్ర గా   ( అనగా లఘువు గా) లెక్కిస్తారు . తెలుగులో పొన్నును దానికి ముందు ఉన్న హ్రస్వా క్షరానికి కలిపి U   గురువు గా గణిస్తాము. దీర్ఘాక్షరం తరువాత వస్తే దానిని కూడా U గా గణిస్తాము. అదే ఉరుదూ లో అయితే దీర్ఘాక్షరం తరువాత వచ్చే పొన్నును ఒక లఘువు I గా గణిస్తారు..... 

------- కావున తెలుగు గజల్ రచయితలు ఉరుదూ గజల్ బహర్ ల ఛందస్సు ను మక్కీకి మక్కీ అనుసరించ వలెనన్న నిబంధన ఏమాత్రం అవసరం లేదని నా  పరిశీలనకు వచ్చిన  విషయంగా నేను భావిస్తున్నాను . 

----------- ఇకపోతే , కాఫియా , రదీఫ్ ల సంగతి ....... ? 

........ ఇప్పటికీ ఈ విషయంలో చాలా మంది  తెలుగుి గజల్ కవులు సందిగ్దంలో ఉన్నట్లు నేను గ్రహించాను . 

-------- నిజానికి ఇదేమంత అర్ధం కాని విషయం కాదు. కాస్త శ్రద్ధ కావాలి అంతే-----  

----దీనిని  శబ్ద బ్రహ్మ డా।। సినారె గారి గజల్ ఉదా।। తో  తెలుసుకుందాము----  

1) చిన్న దీపమని అనుకోకు అది  చీకటినే కాల్చేస్తుంది 
జనమేం చేస్తుందనుకోకు అది జాతకాలు మార్చేస్తుంది 

2) ఎంత తెగించిన సాహసమో నినదించే  ఊరేగింపులకు 
వట్టి పిడికిలే అనుకోకు అది చట్టాలను    పేల్చే స్తుంది 

------------- పై రెండు షేర్  లలో చివరి అంత్య ప్రాసలైన """""  కాల్చేస్తుంది ,  మార్చేస్తుంది , పేల్చేస్తుంది. కాఫియాలు అవుతాయి .  ఈ గజల్ లో రదీఫ్ లేదు. కనక ఇది బేమురద్దఫ్ గజల్ అవుతుంది . 

------------- మరో ఉదాహరణ డా।। సినారె గారిదే. 

1) అవని రూపు పరమాణువునడిగి తెలుసుకో 
కడలి లోతు కన్నీరై కరిగి తెలుసుకో 

2) ఏ సిరులూ పొందని సంతృప్తి ఏమిటో 
కళాసరస్వతుల కాళ్ళు కడిగి తెలుసుకో 

4) నిట్టూర్పు సెగల్లో గీపెట్టే మౌనం 
ఉబికే సుడిగాడ్పులోన ఒదిగి తెలుసుకో 

---------- పై షేర్ లలో ---- మత్లా లోని  పాదాల చివరి రెండు పదాలు " తెలుసుకో "  , అలాగే  2) , 3) షేర్లలోని రెండవ పాదం చివరి పదాలు " తెలుసుకో " అనేవి '"  రదీఫ్ " లు అవుతాయి . 

-------- మరి కాఫియాలు ఏవి ? 
 
-------- మత్లా పాదాంతంలోని  రదీఫ్ (తెలుసుకో )కు ముందు వాడిన ----- 1) అడిగి , కరిగి  మిగిలిన 2వ షేర్ లోని రెండవ పాదంలోని  రదీఫ్ (తెలుసుకో )కు ముందు పదమైన "కడిగి .""" 3) వ షేర్లో రెండవ పాదం చివరి పదమైన రదీఫ్ ( తెలుసుకో )కు ముందు పదమైన "ఒదిగి"" కాఫియాలు అవుతాయి... 

--------- రదీఫ్ లేకుండా రాసే గజల్ల ను , బేమురద్దఫ్ ,  లేక గైర్ మురద్దఫ్ గజల్లంటారు..  ఎలా రాసినా భాష , భావుతలను జోడు గుర్రాల్లా నడిపించగలగాలి . 

------ ఇంకా ఉంది ,  

---------- ఈ వారం గజల్ తరంగిణి ని తెలుగు గజల్ మహాకవి డా ।। సినారె గారి కి స్మృత్యంజలిగా సమర్పించుకుంటూ శలవు తీసుకుంటున్నాను...  

------- వొచ్చే వారం మరిన్ని వివరాలతో మీ, ముందుంటాను. ....  ఆదరిస్తున్న అందరికీ నమస్సులతో --

-- మీ సూరారం శంకర్. 16.06.2017.
[10/15/2021, 16:58] +91 6305 543 917: గజల్ పుట్టిందే సూఫీ తత్వం లో.సూఫీ తత్వం అంటే భగవంతుడు నిరాకారుడు. సూఫీ తత్వం లో ఇక్కడ వున్నాడు.అక్కడ లేడు అనే ప్రశ్నే లేదు.మనం ఎందులో భగవంతుని చూడా లనుకున్నా అందులోనే ఉంటాడు. *ఋగ్వేదంలో.. ఏ కం తత్ విప్ర బహుదా వదంతి* అంటే భగవంతుడు ఒక్కడే! అనేక రూపాలలో చెబుతాం!ఇది ఇస్లాం తత్వం కు పూర్తి వ్యతిరేకం.*లా ఇలా హి ఇల్ల లాహ్*..అల్లా ఒక్కరే! మనం చేసే ప్రతి పూజ అందుకునే వాడు ఆ అల్లా ఒక్కడే. ఇస్లాం తత్వంలో అల్లా ఒక్కడే దేవుడు...సూఫీ తత్వం లో *అల్లా* అనే ప్రశ్నే లేదు. రమాదేవి లో వున్నాడు.మీలో వున్నాడు.మీరు ఎవరిలో చూస్తే వారిలోనే భగవంతుడు ఉంటాడు . అదే కదా మన.భారతీయ సిద్ధాంతం కూడా!
[10/15/2021, 16:59] +91 6305 543 917: మీరు ఎవరో గానీ తెలుసుకోవాలనే తత్వం ఉన్నందుకు అభినందనలు! విజయ దశమి శుభాకాంక్షలు!🌷💐🙏🏿💐🌷👌

Saturday, February 12, 2022

ప్రక్రియలకు పేరడీపాట

కవితా  ప్రక్రియకారులకు ధన్యవాదాలతో  
బలేబలే అందాలుా సృష్టించావుా...
పాటకు పేరడీ..
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

భలే భలే అందాలు కురిపించాయిా
మదిని మురిపించాయిా
మనసు కానందం, పొంగె పద గంధం 
కవిత కన్నెల్లు ప్రతీదినం ॥

రాసిన వన్నీ రసమయ సుధలై
పుాసిన పుాలవోలే  వికసించేయిా..
మితమైన వరుసల ఆగమ సారమై
అందరి మనసుకుా హత్తుకున్నాయిా

 మకుటమ్ములు మంచిగా , మన్నిక నీయగా॥
 పదములె పరిమళాల జల్లులై
కవన వీధి విహరించాయిా ॥

విందులుగానిడు అంశము లెన్నో
జ్ఞానపు నిధులై   మది నిలిచాయిా
అభినందనలా బహుమతులెన్నో
విజయపు చిహ్నాలై ఊరించాయిా
సాహిత్యపు బడిలో సాధించిన బిరుదులే
మా మది కానందపు నిధులేై
కలలెన్నో పండించాయిా..॥

******************

Friday, February 11, 2022

సదయ్యగారి ఆహ్వాన పత్రిక

ఆహ్వానము

మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం

కరోనా ఇష్టపది కవితాసంకలనం-2021 పుస్తకావిష్కరణ మరియు కవిసమ్మేళనము

వేదిక: జూమ్ సమావేశము
తేది: 04-09-2021-సా.6-00 గం.ల నుండి.

ముఖ్య అతిథి & పుస్తకావిష్కర్త :

శ్రీమతి డాక్టర్ మంచాల వరలక్ష్మి గారు
రాష్ట్ర కార్యదర్శి,ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణా స్టేట్ అసోషియేషన్ & తెలంగాణా జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

సభాధ్యక్షులు : శ్రీ డాక్టర్ అడిగొప్పుల సదయ్య గారు
అధ్యక్షులు
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం

ప్రత్యేక అతిథి:

శ్రీ ద్వివాగీశ్ గుడ్ల పరమేశ్వర్ గారు
రాష్ట్ర ఆర్గనైజింగ్ & శిక్షణా కమీషనర్ (స్కౌట్స్)
ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణా స్టేట్ అసోషియేషన్


విశిష్ట అతిథి:

శ్రీ దాస్యం సేనాధిపతి గారు
ప్రముఖ రచయిత, విమర్శకులు

ఆత్మీయ అతిథులు:

శ్రీ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారు
వ్యవస్థాపక అధ్యక్షులు-ఉదయసాహితీ

శ్రీ ముక్కా సత్యనారాయణ గారు
వ్యవస్థాపక అధ్యక్షులు
మునియేటి రచయితల సంఘం-పెనుగంచిప్రోలు

శ్రీమతి డా.సూర్యదేవర రాధారాణి గారు
MD,DGO,ప్రముఖ కవయిత్రి

డాక్టర్ సయ్యద్ సమీనా పర్వీన్ గారు
ప్రముఖ కవయిత్రి, రచయిత్రి

పుస్తక పరిచయం:

శ్రీమతి గుడిపూడి రాధికారాణి గారు
ప్రముఖ కవయిత్రి,వివిధ కవితాప్రక్రియలలో అందెవేసిన చేయి


ఆహ్వానము & సభా నిర్వహణ:

శ్రీమతి కె గీతాశైలజ గారు
ప్రముఖ కవయిత్రి, ఉపాధ్యక్షురాలు
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం

ప్రార్థన: 

శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు
ప్రముఖ వాగ్గేయకారిణి

వందన సమర్పణ:

శ్రీ బీరప్పొల్ల అనంతయ్య గారు
ప్రముఖ కవి,కార్యదర్శి
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం

ప్రసిద్ధ కవుల మాట

*తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి పొందిన
 పదపల్లవాలలో ఇవి కొన్ని. 
 వీటిని ఎవరు రాశారో  చూద్దాం...*

1. ‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు 
     నా ఇచ్ఛయేగాక నాకేటి వెఱపు’’ 
*దేవులపల్లి కృష్ణ శాస్త్రి*

2. ‘‘కప్పివుంచితే కవిత్వం,
     విప్పి చెబితే విమర్శ’’
*డా.సి.నారాయణరెడ్డి*

3. ‘‘ఉదయం కానేకాదు అనుకోవడం నిరాశ,
     ఉదయించి అట్లానే వుండాలనుకోవడం దురాశ’’ 
*కాళోజి*

4. ‘‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్‌’’ 
*నన్నయ*

5. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు’’ 
*సుబ్బారావు పాణిగ్రాహి*

6. ‘‘రాజే కింకరుడగు 
     కింకరుడే రాజగు’’ 
*బలిజేపల్లి లక్ష్మీకాంతం*

7. ‘‘వలపెరుంగక బ్రతికి కులికి మురిసేకన్న 
     వలచి విఫలమ్మొంది విలపింపమేలురా’’ 
*బసవరాజు అప్పారావు*

8. ‘‘నిఖిలలోకమెట్లు నిర్ణయించినగాని 
     తిరుగులేదు విశ్వనరుడ నేను’’ 
*గుర్రం జాషువా*

9. ‘‘అత్తవారిచ్చిన అంటు మామిడి తోట, 
      నీవు కోరగ వ్రాసి ఇచ్చినాను’’ 
*కాళ్ళకూరి నారాయణరావు*

10. ‘‘గాయపడిన కవి గుండెల్లో 
        వ్రాయబడని కావ్యాలెన్నో’’ 
*దాశరధి*

11. ‘‘ప్రజకు రక్షలేదు పత్రికలేనిచో’’ 
*నార్ల వెంకటేశ్వర రావు*

12. ‘‘బావా, ఎప్పుడు వచ్చితీవు’’ 
*తిరుపతి వెంకట కవులు*

13. ‘‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి’’ 
*గురజాడ*

14. ‘‘మాకొద్దీ తెల్ల దొరతనము’’ 
*గరిమెళ్ళ సత్యనారాయణ*

15. ‘‘పరమేశా గంగ విడుము, పార్వతి చాలున్‌’’ 
*శ్రీనాథుడు*

16. ‘‘ఇందు గలడందు లేడని సందేహము వలదు...   
        ఎందెందు వెదకిచూచిన అందందే గలడు’’ 
*పోతన*

17. ‘‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా...
      తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’’ 
*గద్దర్*

18. ‘‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు’’ 
*శ్రీ శ్రీ*

19. ‘‘చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి లేచొస్తాను,
       మరుజన్మకు మాటిస్తావా ఈ క్షణమే మరణిస్తాను’’ 
 *వెన్నలకంటి*

20. ‘‘రావోయి బంగారి మావా 
       నీతోటి రాహస్యమొకటున్నదోయీ’’ 
*కొనకళ్ల వెంకటరత్నం*

21. ‘‘వనిత తనంత తా వలచివచ్చిన 
       చుల్కన కాదె యేరికిన్‌’’
*అల్లసాని పెద్దన*
 
22. ‘‘ఏ గతి రచియించిరేని,
        సమకాలము వారలు మెచ్చరేగదా?’’ 
*చేమకూరి వేంకటకవి*

23. ‘‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’’ 
*త్యాగయ్య*

24. ‘‘రాజుల్‌ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు......’’ 
*ధూర్జటి*

25. ‘‘ఎప్పుడు సంపద కలిగిన 
        అప్పుడు బంధువులు వత్తురు’’ 
*బద్దెన*

26. ‘‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు,
        దానహీను జూచి ధనము నవ్వు’’ 
*వేమన*

27. ‘‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’’ 
*కంచర్ల గోపన్న*

28. ‘‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా’’ 
*సుద్దాల హనుమంతు*

29. ‘‘నువ్వు ఎక్కదలచుకున్న రైలు 
       ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు’’ 
*ఆరుద్ర*

30. ‘‘తల్లి ఒక్కతె మనకు తెలుగోడా 
       సవతిబిడ్డల పోరు మనకేలా’’ 
*వేముల శ్రీ కృష్ణ*

31. ‘‘వీరగంధము తెచ్చినారము, 
        వీరుడెవ్వడొ తెల్పుడీ’’ 
*త్రిపురనేని రామస్వామి*

32. ‘‘మాదీ స్వతంత్రదేశం మాదీ స్వతంత్ర జాతి’’ 
*బాలాంత్రపు రజనీ కాంతరావు*

33. ‘‘ఉప్పొంగిపోయింది గోదావరీ 
       తాను తెప్పున్న ఎగిసింది గోదావరీ’’ 
*అడవి బాపిరాజు*

34. ‘‘కూర్చుండ మా యింట కురిచీలు లేవు’’
*కరుణశ్రీ*
 
35. ‘‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా 
        పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా 
        నడుమ దొర ఏందిరో వాని దూకుడేందిరో’’ 
*గుడ అంజయ్య*

36. ‘‘తను శవమై - ఒకరికి వశమై 
        తనువు పుండై - ఒకరికి పండై 
        ఎప్పుడూ ఎడారై - ఎందరికో ఒయాసిస్సై’’ 
*అలిసెట్టి ప్రభాకర్*

37. ‘‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే 
        మమ్మల్ని విభజించి పాలిస్తోంది’’ 
*సావిత్రి*

38. ‘‘నేను పుట్టకముందే....
        దేశద్రోహుల జాబితాలో నమోదై వుంది నా పేరు’’ 
*ఖాదర్ మొహియుద్దీన్*

39. ‘‘నా దేశాన్ని గూర్చి పాడలేను,
        నీ ఆదేశాన్ని మన్నించలేను"
*బాలగంగాధర తిలక్*

40. ‘‘ఎక్కువ కులజుడైన హీనకులజుడైన 
        నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు’’ 
*అన్నమయ్య*

41. ‘‘ఆరంభింపరు నీచ మానవులు   
        విఘ్నాయాససంత్రస్తులై’’ 
*ఏనుగు లక్ష్మణ కవి*

42. ‘‘అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ’’ 
*పాలగుమ్మి విశ్వనాథం*

43. ‘‘క్రిష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ,
        ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ 
*చలం*

44. ‘‘వంటింటి సామ్రాజ్యానికి 
       మా అమ్మే రాణి అయినా, 
       గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే’’
*విమల*
 
45. ‘‘గుండె గొంతుకలోన కొట్లాడుతాది 
        కూకుండనీదురా కూసింతసేపు’’ 
*నండూరి సుబ్బారావు*

46. ‘‘మాయమైపోతున్నడమ్మా మ


To see more posts like this and join KAVIYATRA , click here 👇👇

https://kutumbapp.page.link/qjFG6zYDNtbcF6Ta6