Thursday, September 22, 2022

బాల సాహిత్యం.

మహతీ సాహితీ కవి సంగమం 
( బాల సాహిత్యం.).
అంశం : " ద" గుణింత పదాలతో...కవిత.

రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.

దాయ్ దాయ్ చందమామ దరికి రావయ్యా
"దా" అంటుా పిలచె పాప కొండెలెక్కి రావయ్య 
దినమంత మా పాప  మారాము  జేసె
దిక్కులన్ని చుాచి చుాచి దీనంగ పిలచె.॥

దోబుాచు లాడబోతె దాగి  దొరకవంట
దొంగాట లాడబోతె   పరుగు పెడతవంట.
దారి మబ్బు బుాచి తాత నిన్నెత్తుకెళ్ళ.
దీనముగ మాపాప  వెక్కి వెక్కి యేడ్చె ॥

దుష్ట  రాహు కేతువులే నిన్ను పట్టి మింగ
ధైర్యముగా పోరాడి వారి జంపెనంట .
దట్టమైన మేఘాలు కమ్మి నిన్ను బట్ట  
దండముతో మా పాప దండించె నంట.॥

దేవతలకు వెలుగు పంచు  దొడ్డ దివ్వె వంట
దేశాలెన్నో తిరిగి కథలు చెపుత వంట
దెయ్యాలే రాకుండా కాపుంటా వంట
దేమునితో మాటాడి దీవిస్తా వంట ॥

దద్దరిల్లు ఉరుము తాత దడుచుకుంటాడంట
ధైర్యముగా మెరుపు బాణ మేసి కొడతా వంట
దెబ్బలకు మెరుపు తాత యేడుస్తాడంట
దుబుకు దుబుకు కన్నీరే కురియు వర్షమంట ॥

దాపు చెరువు నీటిలో నీ నీడను జుాచి
దుాకి మునిగి నీటి నుండి నిన్ను  దెచ్చు నంట.
దోస్తు వంట మా పాపకు దొరకి నావంట.
 దుారి కళ్ళ, జోల పాడ నిద్దరోతదంట ॥

దండిస్తే మా పాపను దరువులు మాకంట
"దా" దమ్మని పిలువ గానె పలుకుతావంట
దుప్పటిలో దుారగానె కళ్ళు ముాస్తా వంట.
దుఃఖమొస్తె కళ్ళు తుడిచి జో కొడతావంట ॥

దాయ్ దాయ్ చందమామ దరికి రావయ్య 
దుడుకు తల్లి మాపాపకు జోల పాడవయ్యా ॥





No comments:

Post a Comment