శీర్షిక : బృహత్కవి గణాడ్యుడు.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
సంతానం లేని దీపకర్ణి అనేరాజు చేసిన పుాజల
ఫలితంగా ఆకాశవాణి నుండి. ".రాజా! యడవిలో
పులి మీద నున్న పిల్లవాని తెచ్చుకో ' అన్న మాట వినిపించింది.
రాజు ఆనంద భరితుడై ఆపిల్లవానికి శాతవాహనుడనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు
బాలునికి విద్యా బుద్ధులు నేర్పించి, వివాహం చేసి రాజుగా పట్టాభిషిక్తుని జేసి తాను వానప్రస్థాశ్రమానికి వెళిపోతాడు.
భార్యకు సంస్కృుతం వచ్చు .కానీ శాతవాహనునికి సంస్కృతం రానందున ఒకానొక సందర్భంలో భార్య అన్న మాటకు జవాబు చెప్పలేక అవమానితుడై ,
తన సభలో, తనకు ఆరునెలలో సంస్క్రుతం నేర్పగలిగినవారు గలరా అని ప్రశ్నించేడు.
అపుడు శర్వ వర్మ , గుణాడ్యుడు అనే పండితులు
సిద్ధమయేరు.
గుణాడ్యుడు సంవత్సర కాలం పడుతుందన్నాడు.
కానీ శర్వవర్మ ఆరు నెలలలో తాను చెప్పగలనని
చెప్పలేకపోతే తాను సంస్క్రుత కావ్య రచనలు మాని , రాజ్యము విడచి అడవికి వెళిపోతానన్నాడు. గణాడ్యుడు తాను ఓడిపోతే తానుకుాడా సంస్కృతాన్ని విడచి యడవులకు వెళిపోతానన్నాడు.
శర్వ వర్మ గణాద్యుని పై అసుాయతో పందెం కట్టి
ఓడిపోతానన్న భయంతో తన గురువునాశ్రయించేడు.
దేవీ ఉపాసకుడైన శర్వ వర్మ గురువాజ్ఞ తో , నిష్ట తో
దేవ్యోపాసన చేసి క్రతకృత్యుడై , దేవీ అనుగ్రహంతో ఆరు మాసాల లో రాజుకు సంస్కృతం నేర్పుతాడు.
అన్న మాట ప్రకారం ఓడిపోయిన గుణాడ్యుడు
అడవులకు వెళ్ళిపోతాడు.
పండితుడైన అతడు ఆ అడవిలోగల జంతు , పిశాచాలతో చరిస్తుా...అదే భాషలో "బృహత్కావ్యమ"నే మహత్తరమైన గ్రంధాన్ని రాస్తాడు
.
గుణాడ్యుడు తెలంగాణ మొదటి లిఖిత కవిగా శాతవాహన రాజైన "కుంతల శాతకర్ణికి" ఆస్థానంలో సంస్కృత కవిగా ఉండే గణాడ్యుడు ...కొన్ని లక్షల శ్లోకాలతోపాటు , ఏడు వేల శ్లోకాలతో ఏడు కథలను వివరించిన "భృహత్కథ "అను గొప్ప గ్రంథరాజమును "దేశి " భాషలో రాసి రాజుకు చదివి వినిపిస్తాడు.
ఆ రోజుల లో "దేశి" భాష "పైశాచిక భాష"గా పరిగణింపబడినందున ఈతని కావ్య గ్రంధ రాజమునకు సరియైన రాజు ఆదరణ గాని ,న్యాయం గాని ,లభించక ప్రాముఖ్యతకు నోచుకోలేని కారణంగా
అవమానితుడైన గణాడ్యుడు తాను రచించిన
బృహత్కథా కావ్యమును ఒకొక్క పుటగా కన్నీటితో కాల్చివేస్తుాండగా అతని హితులు అందులో కొంత భాగాన్ని కాపాడగలిగేరు.
ఆ మిగిలిన గ్రంధ రాజములో పదకొండవ అధ్యాయములో, "త్రివిక్రమసేనునికి భేతాలుడు చెప్పిన 25 అద్భుత కథలున్నాయి ఆ అధ్యాయమే
"పంచవిశంతి" అనే పేరుతో ప్రసిద్ధికెక్కి ప్రాచుర్యము పొందినది.
ఎంతోమంది మహాకవులు శ్లాఘించిన కావ్య గ్రంధమీ
"బృహత్కావ్యం ".
No comments:
Post a Comment