Thursday, April 25, 2024

విహారయాత్ర

మహతీ సాహితీ కవి సంగమం.

ప్రతిరోజూ కవితా పండగే.

తేదీ : 25-4-24. బుధవారం.

అంశం : విహార యాత్ర.

కవితా సంఖ్య: 3 .


శీర్షిక : బాబోయ్ ఎండలు.

ప్రక్రియ : ఇష్టపది.


రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .

క్రమ సంఖ్య: 43.

------------------



వేసంగి సెలవులకు వేడి  ఎండల జోరు 

వేడుకల యాత్రలకు వెరసి పిల్లల పోరు.

చల్ల గాలులు నిండు చల్లని ప్రదేశమని 

కుల్లూమనాలీకి. కూడిపోయే మండి.!!


ఖర్చునిండిన యాత్ర కన్నీరు తెప్పించె

వంటి చెమటల బాధ వరుస కోపము పెంచె.

మంచులో ఆటలకు పెంచు రుసుమది జూచి

మారు మాటే లేక మరలిపోతిమి మేము !!


ఇంటి ఏ.సీలోన  ఇల్లే స్వర్గమాయె.

చలివేండ్రముల సేవ చక్కగా మదితోచె

పక్షులకు నీళ్లొ సగు పనికి పిల్లలు మురిసె

పసిడి ధాన్యములొసగి పరుగునల్లరి జేసె


చెట్ల నీడను గూడి చెలగి యాటలు యాడె

చేత చిలికిన చల్ల, చేరు వారికి పంచె

 మంచి పనులను నేర్పి మాత, తాతలు మురిసె

మేలు  యాత్రల కన్న మేటి పనులే మిన్న !!


----------------------------------


*శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు వేసవి సెలవులు ఎండల జోరు చల్లటి గాలులు పిల్లల పోరు కులుమనాలి విహారయాత్ర ఖర్చుతో కూడుకున్న ఇలలో స్వర్గమే అంటూ చెట్ల నీడలో చెలరేగి ఆడే ఆటలు చల్లటి మజ్జిగను తాతయ్యల మురిపాలు అన్నింటినీ కలగలిపిన సమ్మేళనం చక్కటి భావాలతో రచన బాగుంది, ధన్యవాదములు*

👌👏👌👏👌👌👏🚩👏🙏👍🙏💐






No comments:

Post a Comment