అంశం : మాత సావిత్రీబాయిఫుాళే .
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.(మహరాష్ట్ర )
శీర్షిక :మహిళ , మహోన్నత శిఖరం
అంతర్గత ఆవేశానికి ప్రతిరుాపం.
స్త్రీ ల హక్కులకోసం తపించిన
సామాజిక విప్లవకారిణి .
తొలి మహిళా సంఘ సంస్కర్తగా-
స్త్రీ ల విముక్తికై నిరంతర పోరాటం.
స్త్రీల విద్యాభివృద్ధికై చేసిన ఉద్యమం.
నాడు ఆమె చేసిన పోరాటాల ఫలితం ,
స్త్రీల ఉన్నత విద్యలకు సోపానం.
కులం, పితృస్వామ్యంపై
కలం యుద్ధం నడిపిన కవయిత్రి.
భర్త జ్యోతీరావ్ ఫుళే సహకారంతో
నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం
పణంగా పెట్టి సమష్టిగా చేసిన పోరాటం .
శూద్రుల, అస్పృశ్యుల, మహిళల -
హక్కుల కోసం పోరాటం చేయటం -
సామాజిక బాధ్యత అనేది -
ఆ దంపతులు విశ్వాసం.
కుల, వర్గ,లింగ,వివక్షతలు, ఆమె
పట్టుదలకు తలవంచిన వివశతలు.
ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి
మహిళా ఉపాధ్యాయురాలు.
స్త్రీ హక్కు సందేశాలు విస్తృతంగా
ప్రచారం చేస్తుా ,బాధ్యలు నిర్వహిస్తూ
నడిపిన అనేక ఉద్యమాలు.
ఫలితం వితంతువులకు వివాహాలు .
భర్తతో కలిసి శూద్రకులాల బాలికలకోసం
పూనేలోమొదటి పాఠశాల ప్రారంభించిన
పంచమే ఇల్లుగా అనాధలు అక్రమంగా పుట్టి రోడ్లపాలైన బిడ్డల్నే తన బిడ్డలుగా చేసుకున్న
అమ్మగా "సావిత్రీబాయిఫుాళే "ఘనత ,
కుల వ్యతిరేక ఉద్యమాల్లో స్త్రీ
హక్కుల పారాటంలో సావిత్రిబాయి
నిర్వహించిన పాత్ర మరువలేనిది .
"సావిత్రీబాయిఫుాళే "ప్రతీ స్త్రీ కి
ఆదర్శ ప్రాయమైన అద్భుత చరిత.
మూఢ విశ్వాసాలు ఆచరించినంత కాలం
ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పురాదన్న
సందేశాన్ని హేతువాదంగా తమ కవితల లో
నింపిన"క్రాంతి బాయి " సావిత్రీబాయి ఫూలే
ఆధునిక భారతదేశ చరిత్రలో ఎప్పటికీ
ధృవతారగా వెలుగొందుతూనే ఉంటుంది.
అంశం : మాత సావిత్రీబాయిఫుాళే .
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.(మహరాష్ట్ర )
శీర్షిక :మహిళ , మహోన్నత శిఖరం
అంతర్గత ఆవేశానికి ప్రతిరుాపం.
స్త్రీ ల హక్కులకోసం తపించిన
సామాజిక విప్లవకారిణి .
తొలి మహిళా సంఘ సంస్కర్తగా-
స్త్రీ ల విముక్తికై నిరంతర పోరాటం.
స్త్రీల విద్యాభివృద్ధికై చేసిన ఉద్యమం.
నాడు ఆమె చేసిన పోరాటాల ఫలితం ,
స్త్రీల ఉన్నత విద్యలకు సోపానం.
కులం, పితృస్వామ్యంపై
కలం యుద్ధం నడిపిన కవయిత్రి.
భర్త జ్యోతీరావ్ ఫుళే సహకారంతో
నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం
పణంగా పెట్టి సమష్టిగా చేసిన పోరాటం .
శూద్రుల, అస్పృశ్యుల, మహిళల -
హక్కుల కోసం పోరాటం చేయటం -
సామాజిక బాధ్యత అనేది -
ఆ దంపతులు విశ్వాసం.
కుల, వర్గ,లింగ,వివక్షతలు, ఆమె
పట్టుదలకు తలవంచిన వివశతలు.
ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి
మహిళా ఉపాధ్యాయురాలు.
స్త్రీ హక్కు సందేశాలు విస్తృతంగా
ప్రచారం చేస్తుా ,బాధ్యలు నిర్వహిస్తూ
నడిపిన అనేక ఉద్యమాలు.
ఫలితం వితంతువులకు వివాహాలు .
భర్తతో కలిసి శూద్రకులాల బాలికలకోసం
పూనేలోమొదటి పాఠశాల ప్రారంభించిన
పంచమే ఇల్లుగా అనాధలు అక్రమంగా పుట్టి రోడ్లపాలైన బిడ్డల్నే తన బిడ్డలుగా చేసుకున్న
అమ్మగా "సావిత్రీబాయిఫుాళే "ఘనత ,
కుల వ్యతిరేక ఉద్యమాల్లో స్త్రీ
హక్కుల పారాటంలో సావిత్రిబాయి
నిర్వహించిన పాత్ర మరువలేనిది .
"సావిత్రీబాయిఫుాళే "ప్రతీ స్త్రీ కి
ఆదర్శ ప్రాయమైన అద్భుత చరిత.
మూఢ విశ్వాసాలు ఆచరించినంత కాలం
ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పురాదన్న
సందేశాన్ని హేతువాదంగా తమ కవితల లో
నింపిన"క్రాంతి బాయి " సావిత్రీబాయి ఫూలే
ఆధునిక భారతదేశ చరిత్రలో ఎప్పటికీ
ధృవతారగా వెలుగొందుతూనే ఉంటుంది.
No comments:
Post a Comment