ప్రేయసి, ప్రేయసి, పేదవాడను నేను......
తెలుగు వెలుగు సాహిత్య వేదిక ,
అంశం.ప్రపంచ కవితా దినోత్సవ సందర్భంగా
ప్రపంచ కవితా దినోత్సవం
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
ప్రపంచ కవితా దినోత్సవం
కవితలో మధురిమలు, కమ్మని రాగాలు,
అక్షరాల అలలతో, హృదయ స్పందనలు-
భావాల ఒడిలో, పదాల పల్లకీలు.!!
ఊహల రెక్కలతో, ఎగిరే పక్షులమై
ప్రేమ, విరహం, ఆనందం, వేదనల,
భావ సమ్మేళనలు, నిండే కవితా గానం-
మనసు భావనలకిడే స్వాంతన సందేశం !!
ప్రకృతి అందాలు, మనిషిలోని భావాలను
వెలికితీసీ వర్ణించే, కవితా కళా స్వరూపాలు
అంతర్జాతీయ భాషల్లో, ప్రాంతీయ యాసల్లో,
వెలుగు నింపుతున్న అక్షర స్వరూపాలు!!
కవుల కలాల , జాలువారే కవితాక్షరాలు,
మన హృదయాలను, తాకే ఆనంద తీరాలు.
భావ సమర్పణల అక్షరారాధనలు
గౌరవ పురస్కారాలు నిండిన కవితా దినోత్సవాలు,!!
No comments:
Post a Comment