మహతి సాహితీ కవి సంగమం.
ప్రతిరోజు కవిత పండుగే..
అంశం : చిత్ర కవిత.
శీర్షిక : స్వర్గానికి నిచ్చెన.
రచన : శ్రీమతి : పులాభట్ల జగదీశ్వరీమూర్తి
కళ్యాణ్ : మహరాష్ట్ర.
కవిత సంఖ్య : 1.
కవి సంఖ్య 43.
మానవత్వం మరువని మదిలో,
కరుణా జలధి పొంగు వేళ,
నిస్వార్థపు సేవ నిరతం సాగగా,
స్వర్గానికి నిచ్చెన చేరువౌనుగా.!!
అహంకారం విడనాడి, ప్రేమను పంచగా,
ద్వేషం మాని, మైత్రిని పెంచగా,
సహనం, క్షమ గుణములు అలవరచుకోగా,
స్వర్గానికి నిచ్చెన చేరువౌనుగా !!
జ్ఞానం అనే దీపం వెలిగించగా,
అజ్ఞానం అనే చీకటి తొలగించగా,
సత్యం, ధర్మం మార్గంలో నడవగా,
స్వర్గానికి నిచ్చెన చేరువౌనుగా !!.
ప్రతి జీవిని ప్రేమతో చూడగా,
ప్రకృతిని తల్లిలా ఆరాధించగా,
సేవయే జీవిత పరమార్థమని తెలుసుకోగా,
స్వర్గానికి నిచ్చెన చేరువౌనుగా.!!
--------------------------
ఈ రచన నా స్వీయ కవిత.
No comments:
Post a Comment