4/08/2021.ఉమెన్ వారియర్స్ కు పంపినది
అంశం : రక్షాబంధన్.
శీర్షిక : ఆపదలో అభయం.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
కృుారుడు శిశుపాలుడు.
కడు వికృత స్వరుాపుడు.
ఐనాడు శ్రీకృష్ణుని స్పర్శతోడ
సుందరుడు.॥
అతని వల్లనే కొమరుడు
కడతేరుట సత్యమని
ఎరిగిన శృతదేవికోరె
పుత్ర బిక్ష.శ్రీకృష్ణుని ॥
నుారు తప్పులు దాటిన
వధియింతును ఆతనినని.
మాట ఇచ్చి తప్పులెన్నొ
క్షమియించెను కృష్ణుడు ॥.
తప్పులన్ని నుారు దాట
చంపె వాని జిష్ణుడు .
పోరునదే స్వల్పముగా
గాయపడెను కృష్ణుడు॥
రక్తము చిందిన క్రిష్ణకు
కట్టు కట్టె ద్రౌపతి.
ఆ ప్రేమకు సంతసించి
అభయమిచ్చె శ్రీపతి.॥
జుాదములో ఓడిరదే
పాండవులు సతి ద్రౌపతిని .
దుశ్యాసనుడవమనింప
వలువ లొలిచె ద్రౌపతివి ॥
అసహాయ స్థితిలొ కోరె
శరణాగతి ద్రౌపతి.
శ్రీకృష్ణుడు అభయమిచ్చి
చీరలొసగె భగినికి ॥
ఆ ఘటనయె రక్షగ నిల
ఖ్యాతికెక్కె అభయమై.
జనులందరు హర్షమంది
పటించిరామొాదులై.॥
శ్రావణ పౌర్ణమి నాడదె
రక్షా బంధన దినముగ
జరుపు కొంటిరిలనందరు
ఆనందపు పండగ ॥
రక్ష కట్టిరక్కా- చెల్లెళ్ళు
భువిని అన్నలకు.
ఆభయమిచ్చి దీవింతురు
అన్నలు తమ చెల్లెళ్ళకు.॥
.హామీ:
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచన
No comments:
Post a Comment