Wednesday, May 12, 2021

మనిషి మారాలన్న..

మహతీ సాహితీ కవి సంగమం కరీంనగర్
ప్రతి రోజూ కవితా పండుగే
పర్యవేక్షణ డా.శ్రీ .అడిగొప్పులసదయ్యగారు
నిర్వహణ.శ్రీ .ముక్కా సత్యనారాయణ గారు
సమీక్షణ.డా.శ్రీ .అడిగొప్పుల సదయ్య గారు
అంశం మనిషి  మనసు
తేది 06  05  2031 గురువారం
ప్రక్రియ : ఇష్టపది. 

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక  :  మనిషి మారాలన్న.


మనసు మనసో యనుచు  మన నెేమి లాభమది
మనసు మాటను విన్న  మనిషెవడు ధరలోన॥

మనసు మంచిని చెప్ప  మనిషి బుద్దెరుగదుగ 
మాయ మాటల జెప్పి మనసణచి వేతురుగ ॥

నా ఇల్లు నా వాళ్ళు  నాది నాదని కోరి
నమ్ము వారిని గుాల్చె  సొమ్ము  సోకుల కన్న

స్వార్ధ మదె పెరుగగా  వ్యర్ధ జీవిగ మారి
వేల తప్పుల జేసి  వెతలెన్నొ పడుదురుగ ॥

-------------------------------------------------------

ధనము కొరకై పోరు ధనము కొరకే హోరు
 జనము నమ్మిన నోటు ధనముకమ్మిరి ఓటు॥
 
ధన మదముతో మనిషి తన -పరల నెరుగకను
అధికార బలము తో ఆధిపత్యము జేసె॥

 మితిమీరె పరిధులు అతివ కవమానములు 
 కన్నీటి కార్చిచ్చు  కరిగె సిరి సంపదలు॥
 
 నాడున్న సుఖ శాంతి  నేడు జగతిని లేదు
 అన్ని తెలిసీ మనిషి   ఆశ వీడుట లేదు ॥

---------------------------------------------------

చదువున్న వారేమొ  చవిలేని బ్రతుకేల
చదువు లేనివారదె  చక్క పాలకులైరి ॥

అవగాహనాలోప మవని నిక్కటులేల
జనులెల్ల  జడులైరి జడిసి పాలకులకుా॥

మానవత్వము తరిగె  దానవత్వము పెరిగె
మమతానురాగాలె  మట్టికలిసీపోయె॥

మార్పు రావాలంటె మనిషి మారాలన్న
ఇలనీశ్వరీ మాట  ఇచ్ఛతో వినుమన్న ॥
-------------------------------------------------

No comments:

Post a Comment