హంస వాహినీ కవితా సముాహ ఆధ్వర్యంలో..
భువన సాహిత్య విజ్ఞాన వేదిక తెలంగాణ
వారి కవితా పోటీల కొరకు
అంశం : రవీంద్ర నాథ్ ఠాగుార్.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక : మానవీయ శక్తి.
పుట్టిన ప్రతీ ఒక్కరుా,ఏదో ఒకటి
సాధిద్దామనుకొంటారు .
కొందరు కీర్తి మంతులౌతారు
కొందరు నీతిమంటులౌతారు.
కొందరు మాత్రమే చరిత్ర లో నిల్చిపోతారు.
అటువంటి వారిలో
శ్రీ...రవీంద్రనాథ్ టాగుార్ ఒకరు.
స్వతహాగా కవియైన రవీంద్రనాధుని
సాహిత్యంలోపద్య ,గద్య,కావ్య
నాటకాలు ఎంతో ప్రసిద్ధి గాంచినా..
గీతాంజలి కావ్య రచనతో నోబెల్
హుమతిని గెలుచుకొన్నాడు.
మానవీయతగల రవీంద్రులు
జాతి, కుల, మతాలకు అతీతమై
శాంతినికేతన్ గా పేరుగాంచిన
విశ్వ భారతి, విశ్వ విద్యాలయాన్ని
స్థాపించి విశ్వ కీర్తిని పొందేడు.
సంగీతం ,చిత్రకళలన్న మక్కువ .
జాతీయ భావోద్వేగుడైన ఠాగుార్
అనేక దేశ భక్తి గీతాలను ఆలపిస్తుా
ఉద్యమాలకు ఊపురిపోసేవాడు.
అదే ఉద్వేగంతో అతడు రాసిన
జన గణ మణ గీతం జాతీయ గీతమై
ప్రజల గుండెల్లో నేటికి నిలచిపోయింది..
అతని రచనలు మానవత్వానికి
ఉదాహరణలు. గాయకునిగా భారతీయ
సంగీతంలో "రవీంద్ర "సంగీతమనే
శాఖకు ఊపిరిపోసి..చరిత్రలో
నిలిచిపోయిన.,మానవీయ శక్తి ..
మహా మనీషి.."శ్రీ రవీంద్రనాథ్ ఠాగుార్"..॥
No comments:
Post a Comment