సాహితీ బృందావన జాతీయ వేదిక అధ్వర్యంలో ,
ప్రపంచ కవితా దినోత్సవాన్ని
పురస్కరించుకొని, రాసిన కవిత.
రచన:శ్రీమతి: పుల్లాభట్ల -
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర.
అంశం :సాహిత్యం....కొత్తపుంతలు.
శీర్షిక :దారి తప్పిన అక్షర కన్య.
ఒకప్పటి సాహిత్యం, భావ సౌరభ సుమ
సమాహారంలో మేలిమి ముత్యాక్షరాలై ముద్దులొలుకుతుా, మన సంస్కృతి కి
వన్నె తెచ్చే రీతిలో ఛందోబద్ధమై
గద్య ,పద్య, కావ్య, పురాణాల కవన
వనంలో సుగంధ పరిమళాలు వెదజల్లుతుా,
భరతమాత కీర్తి కిరీటపు ద్యుతిని
ఇనుమడింపజేసే అజరామర కవ్య
మంజరియై ,చరిత్రలో జ్ఞాన చేతన్య
ఖనిగా వర్ధిల్లి వేల జేల నందుకున్నాది ॥
రాను రానుా సరళభాషోద్యమకారుల.
సౌజన్యంతో,చదువ సొంపుగా మారిన..
అక్షరం తన ఆకృతికి పలురాష్ట్ర భాషా
రంగుల్ని పులిమి, ఒకొక్క చోట
ఒకొక్క విధంగా తనను తాను
మలచుకుంటుా...చివరకు కొత్త దనపు
రుచులు మరిగి, ఛందస్సు సౌందర్యానికి
కొత్త రంగుల్ని పులిమి సహజసిద్ధమైన
అసలు అందాన్ని కోల్పోయింది.॥
రసమయ కావ్యాక్షరాలు గిడసబారి
నాలుగు లైన్ల నుాతన పరిమాణాలతో
నలుగురికి అందుబాటైన రీతిలో
అర్హత, అనర్హతల మధ్య ఆటబొమ్మలై
తమ ఉనికిని కోల్పోయాయి , ॥
హామీ :
ఈ కవిత ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని
నా స్వీయ రచన.
No comments:
Post a Comment