Saturday, April 3, 2021

మందాక్రాంతము అనే వృత్త పద్య ప్రక్రియ.

-------------------------------------------------------
*విశేష వృత్తము : మందాక్రాంతము (శ్రీధరా)*

`శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం' - అనే ప్రసిద్ధమైన శ్లోకము మందాక్రాంత ఛందస్సులో వ్రాసినదే.  
కాళిదాసు మహాకవి మేఘసందేశం అనే కావ్యమును కేవలము మందాక్రాంతములతోనే రచించెను.

*లక్షణములు :*
4 పాదములు ఉండును
గణములు - మ భ న త త గ గ 
యతి - 11వ అక్షరము 
ప్రాసనియమము కలదు

మం. 
గోపాలా! గోకుల తిలక!హే గోపికాలోల! కృష్ణా!
తాపమ్మేమో! మృదువచనమే తన్మయత్వమ్ము,నాథా!
కోపమ్మేలా? ననుఁ గనుమ! నీ కోసమే వేచినానే!
శాపమ్మౌ నాకిది, కినుకలే చాలురా! ముద్దు కృష్ణా!
-------------------------------------------------------

No comments:

Post a Comment