Saturday, August 8, 2020

పింగళి వెంకయ్య ...ఝండా నిర్మాత

శీర్షిక.
నమః సుమాంజలి.
-------------------------------
శాంతియుత పోరాట పట్టుదల తో, 
సాధించిన ,దేశ స్వాతంత్ర్యం.
 "జాతి  పిత గాంధీజీ " కలల పంట.
పింగళి వెంకయ్యగారి, దేశ భకి  నిరతి-
 గాంధీజీ  గారి బాటలో నడిపించిన శక్తి.
ఇద్దరి దేశ సమైక్యతాభావనా  దృష్టితో..
రుాపొందిన జాతీయ పతాక సృష్టి. , 
ముాడు రంగుల మచ్చటైన -
భావనా  రుాప సంపత్తి-
ఆకుపచ్చ ,కాషాయ రంగుల సమ్మేళనం
సర్వ మత,  సమైక్యతా భావానికి నిదర్శనం.
తెల్లని తెలుపు ,మధ్యలో  చక్ర సుదర్శనం.
సత్య -అహింసా ఆచరణల నిత్య సందేశం.
ఎన్నటికీ స్ఫుార్తినిచ్చే మహోత్కృష్ట 
"పతాక రుాప కర్త " ఆలోచనా సరళి.----
ఆవిష్కరించిన "పింగళి వెంకయ్య" గారికి,
                    నమఃసుమాంజలి.
                    -----------------------
రచన,శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్్. మహారాష్ట్ర.
8097622021
----------------------
  హామీ..
  ఈ కవిత ,  ఏ మాధ్యమునందు ప్రచురితం కాని , నా స్వీయ రచన.
  ----------------------------------------

No comments:

Post a Comment