Thursday, August 20, 2020

పింగళి వెంకయ్య. ఝండా రుాపకర్త.

రచన ,శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ ..మహారాష్ట్ర .
8097622021
---------------------
శీర్షిక.
ఝండా సృష్టికర్తకు-
వేల జే జేలు.
--------------------
పలు భాషలను నేర్వ పరదేశములకేగి
మేటి విద్యల నేర్చె కీర్తి ఘనుడు.
భుాగర్భ శాస్త్రము ల పరిశోధనలు జేసి
కీర్తి కెక్కిన మేటి చారిత్ర కారుడు.
జాతీయ ఝండాకు రుపకల్పన జేసి
జాతి గౌరవము నిలుపు ఖ్యాతి గౌరవుడు.
"జాతీయ పతాక" మను గ్రంధ రచనను
ఆంగ్లమున రచియించె, సమరయొాధుండు.
జాతిపిత జాడల లొ వెన్నంటి నడచేడు.
ఆంధ్రోద్యమము చేయ ముందు నిలచేడు.
జాతీయ ఝండాకు రుాపకర్తలు వీరు
స్వాతంత్ర్య ఉద్యమా సమర యొాధులు వీరు.
దేశమును ప్రేమించు త్యాజధనులలొ ఒకరు
"పింగళ  శ్రీ వేంకయ్య" నామధేయులు వీరు.
ముాడు రంగుల ఝండ మచ్చటగ నిలిపేటి
సమర యొాధుల కివియె "వే జేల అంజలులు" ॥
-------------------------------------------------------------

No comments:

Post a Comment